Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: zone-4 gvmc

GovernmentPolitical

పూర్ణామార్కెట్ ని దోచేస్తున్నారు..

  • పార్కింగ్‌ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్న గజ దొంగలు..
  • గుత్తేదారులు చేస్తున్న చేష్టలకు చిరాకు పడుతున్న వ్యాపారులు..
  • నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆశీల వసూలుదారులు..
  • రూ.2లకు బదులు రూ.10లు.. రూ.30లకు బదులు రూ.300లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్‌గా గుర్తింపు పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న గుత్తేదారులు అక్కడ ప్రజలను, చిరు వ్యాపారులను దోచుకుంటున్నారని బోరున విలపిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ జీవీఎంసీ తరుపున ఆశీలు వసూలు చేస్తున్నామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక కార్పొరేటర్‌ మాటకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగ గుత్తేదారులు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన

ఆస్తి పూర్ణామార్కెట్‌ ఒకటి. ఈ క్రమంలో జోన్‌-4 కార్యాలయ
పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగల కంటే ముదురు దొంగలకు అప్పగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు దిగువ స్థాయి సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్‌ నిబంధనలు ప్రకారం స్కూటర్‌ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.200నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా లేని రశీదులను ముద్రించి రూ.300వరకు దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.200ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.

– మార్కెట్‌ని దోచుకోవడంలో ముదురులు..

జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా బి.శ్రీరామమూర్తి ఆర్‌సీ నెంబర్‌ 712/2024 పేరిట అధికారం కైవసం చేసుకొని రశీదులు సైతం ముద్రించారు. కానీ ఇక్కడ సమాన వాటాలతో పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు పాటదారులు రింగుగా ఏర్పడి వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా అనధికారికంగా జంగిడీ, తమలపాకుల వ్యాపారుల నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే పండుగ రోజుల్లో అయితే ఇష్టానుసారంగా రూ.500లకు పైగా వసూలు చేస్తున్నారు. పలువురు వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కార్పొరేటర్‌ భాగస్వామ్యం కూడా ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్‌ అవుతున్న మరో ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.

ఎవ్వరైనా ఫిర్యాదు ఇస్తే వెంటనే రద్దు చేస్తాం..

జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఎవ్వరైనా సరే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు, కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం. – ఎం.మల్లయ్య నాయుడు (జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌).

GovernmentHealth

37 వార్డులో పంజా విసిరిన అతిసారం (డయేరియా)

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిథి): అధికారులు, అక్కడి నాయకుల పనితీరుతో ఓ వార్డులో అతిసారం రాజ్యమేలుతుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో పెద్ద, చిన్న అనే వ్యత్యాసం లేకుండా సమీప ఆసుపత్ర్రులకు పరుగులు పెట్టడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గంట గంటకు రెండు నుంచి మూడు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సుధూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి పలితం లేదని బోరుమంటున్నారు. 37వ వార్డు జబ్బరితోట ప్రాంతంలో రెండు రోజుల్లో సుమారు 15మందికి పైగా అతిసారం (డయేరియా) పంజాకు గురయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెలల తరబడి పెద్ద కుప్పగా మురుగుతున్న వ్యర్థాలను తొలిగించి వెళ్లినా అతిసారం తన తీరుని ఏ మాత్రం తగ్గించుకోలేదని కనిపిస్తుంది. స్థానిక శానిటరీ అధికారి, సిబ్బంది ఇటుగా పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న స్మశానవాటిక గోడకు ఆనుకొని నెలల తరబడి మురుగుతున్న వ్యర్థాలతో పాటుగా యూజీడీ లైన్లు పొంగి పొరలడంతో మంచినీరు కలుషితమై డయేరియాకు గురవుతున్నట్టు పలువురు వైద్యుల వివరణతో స్థానికులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆసుపత్ర్రుల్లో ఐసీయూల బాట పట్టడంతో మిగిలిన ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు. నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ నీటిని తాము కూడా సేవించామని, ఎటువంటి సమస్య లేదని అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఓ ఆలోచనలో పడ్డ ప్రజలు మరలా భయాందోళనలో పడినట్టు అయ్యింది.

– అతిసారం వలలో ఒకే ప్రాంత వాసులు ఎలా..?

ఎటువంటి నీటి కాలుష్యం జరగలేదని జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది చెప్పిన సమాధానానికి అక్కడ ప్రజలందర్ని సందిగ్ధ్ధంలో పడేసింది. ఒక ఇంట్లో అందరికీ అతిసారం లక్షణాలు కనిపిస్తే ఆహార కలుషితం అయ్యిందని అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండానే వార్డులో ఒకే ప్రాంతంలో ఉన్న సుమారు 15మందికి పైగా వ్యధి గ్రస్తులుగా మారండం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ అధికారులు, నాయకులు ఘటనా స్థలానికిచేరుకొని అక్కడ ఏర్పడిన సమస్యపై ఓ వివరణ ఇస్తే మిగిలిన ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. స్థానికంగా వ్యర్థాలు సమస్యతో పాటుగా నీటి కలుషితం పైన కూడా దృష్టి కేంద్రికృతం చేయాలని పలువురు ప్రాథేయపడుతున్నారు.

Government

జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శిల చేతివాటం

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం: జీవీఎంసీ జోన్‌-4లో పట్టణ ప్రణాళిక కార్యదర్శిలు చేతివాటం చూపిస్తూ చెలరేగిపోతున్నారు. తాము చేసిందే చట్టంగా వార్డు స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. గతంలో చైన్‌మాన్‌లు చేసిన అవినీతికి ఏ మాత్రం తగ్గకుండా జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ పరువుని నిలబెడుతున్నారు. ఇన్‌ఛార్జీ ఏసీపీ, టీపీవోగా వ్యవరిస్తున్న అధికారి, తన కింద టీపీఎస్‌ స్థాయి సిబ్బంది సైతం ఉన్నా ఇటుగా ఒక్కసారి కూడా తొంగి చూడలేదంటే భవన యజమానులు అక్కడికి ఎన్ని ముడుపులు పంపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుమతులు లేకుంటే విద్యుత్తు, మంచి నీరు వంటి సధుపాయాలు ఇవ్వడం కుదరదని జీవీఎంసీ కమిషనర్‌ ఇప్పటికే ప్రకంటించినా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగువ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు రూ.లక్షలకు కక్కుర్తి పడి భవన యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. 36వ వార్డులో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పరిస్థితిపై సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి విట్టల్‌ను ఆరా తియ్యగా.. కాకమ్మ కబుర్లు చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును తన ఖాతాలో వేసుకొని ఆ వార్డులో ఇన్‌ఛార్జీ మాత్రమే చేస్తున్నాను. పూర్తిస్థాయిలో సమాచారం కావాలంటే భవనం వద్దకు వెళ్లి తెలుసుకొండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో 35వ వార్డు వెలంపేటలో నిర్మిస్తున్న మరో భారీ భవనానికి సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి శ్వేతని వివరణ కోరగా ఆ భవనానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, ఎటువంటి అదనపు అంతస్తులు నిర్మించలేదని మసిబూసి మారేడుకాయ మాటలతో తప్పించుకుంటున్నారు. ఈమెకు కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని, పైగా ఓ కార్పొరేటర్‌ నిర్మిస్తున్న భవనం కావడంతో తానే దగ్గరుండి అక్రమ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారని సమాచారం.

 

  • టౌన్‌ ప్లానింగ్‌లో అందరికీ సమాన వాటాలు..

జోన్‌-4 పట్టణ ప్రణాళిక విభాగంలో అందరికీ సమాన వాటాలు ఉంటాయని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో ఛైన్‌మాన్‌లు చేసిన పనులను ఇప్పుడు నేరుగా టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జోనల్‌ కార్యాలయంలో ఉండే అధికారులకు ఓ రేటు.. తమకు మరో రేటును ముందస్తుగానే ఒప్పందం చేసుకొని దండీగా దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ విలేకరులు కలుగజేసుకొని ఆరా తీస్తే వాళ్లకు కొంత సొమ్మును కట్టబెట్టి నిర్మాణాలను శెరవేగంగా కట్టుకుంటున్నారు.

 

  • నకిలీ ఇంటి ప్లాన్‌లతో అక్రమ నిర్మాణాలు..

వార్డు స్థాయిలో ఓ అక్రమ నిర్మాణం నిర్మించాలంటే మొదటిగా జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వేయర్‌లు నకిలీ ప్లాన్‌లను తయారు చేసి ఓ కోడిరగ్‌ పద్ధతిలో సంబంధిత టౌన్‌ప్లాన్‌ంగ్‌ అధికారికి అందిస్తున్నారు. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి ఒప్పందం చేసే వరకు పూర్తి బాధ్యత సర్వేయర్‌లే తీసుకుంటారు. ఆ తరువాత ప్లానింగ్‌ సెక్రటరీ ద్వారా మరోమారు దాడి చేసి మరోమారు రూ.లక్షల సొమ్మును రుచి చూస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా ప్లానింగ్‌ కార్యదర్శి మరికొంత సొమ్ము తీసుకొని చూసి చూడనట్టు వార్డులో వ్యవరిస్తారు.

GovernmentPolitical

టౌన్‌ ప్లానింగ్‌లో రింగ్‌ మాస్టర్‌లు

  • జోన్‌-4లో అక్రమ వసూలతో చెలరేగిపోతున్న ప్లానింగ్‌ సిబ్బంది..
  •  సిబ్బంది అండతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న యజమానులు..
  • ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌లు, సెక్రటరీలు హెచ్చు తగ్గు వాటాలతో లబ్ధి.. 
  • కార్పొరేటర్‌ల అండతో భారీ నిర్మాణాలకు నకిలీ అనుమతులు..
  •  అదనపు అంతస్తులు నిర్మిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు..
  • ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్న చోద్యం చూస్తున్న అనిశా..

 

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్‌-4లో టౌన్‌ప్లానింగ్‌ రింగ్‌ మాస్టర్‌లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.

జోన్‌-4 టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్‌-4 టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది, వార్డు ప్లానింగ్‌ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.

 

 

  •  అవినీతిని అంతం చేయాల్సిన సిబ్బంది ఆజ్యం పోస్తున్నారు..
    పేద ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి అవినీతి జరగకూడదని, అవినీతిని అంతం చేయడానికి నూతన ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఆ వ్యవస్థలో సైతం అవినీతి బురద చేరిపోయింది. ముందున్న ముదురు సిబ్బంది వెళ్లే మార్గంలో సంబంధిత కార్యదర్శులను తీసుకెళ్లడంతో అవినీతిని అంతం చేయాల్సిపోయి ఆజ్యం పోస్తున్నట్టు తయారైయింది. చైన్‌మాన్‌లు నిర్ణయించిన ధరలో తమకు సైతం వాటా వస్తుందని అనధికార అదనపు అంతస్తులను చూసి చూడనట్టు వ్యవరిస్తున్నారు. తీరా ఆ నోటా.. ఈ నోటా.. అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని ఒత్తిడి తీసుకొస్తే ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రారంభంలో సెల్లార్‌ ఫ్లోర్‌లో ఖాళీగా దర్శనమిచ్చే ఫ్లోర్‌ ప్రస్తుతం గదులతో దర్శనమిస్తున్నాయని ప్రశ్నిస్తే వాటికి కూడా అనుమతులు ఉన్నాయని సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ పత్రాలు చూపిస్తూ తప్పించుకుంటున్నారు. జోన్‌ పరధిలో అవినీతి జలగలు ఉన్నంత వరకు అనుమతులు లేని అదనపు అంతస్తులు వస్తునే ఉంటాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  • ప్లానింగ్‌ సిబ్బంది చెలరేగిపోతున్నారు..
    జోన్‌`4లో టౌన్‌ప్లానింగ్‌ చైన్‌మాన్‌లుగా కొనసాగుతున్న కొందరు వ్యక్తులు చేప్పిందే శాసనంగా తయారైయింది. వార్డుల్లో పర్యటించి అనధికార అంతస్తులు నిర్మిస్తున్న యజమానులతో ముందస్తుగా బేర సారాలు చేస్తున్నారు. తీరా అక్కడ వ్యాపారం తమ పరిధిలోకి రావడం లేదని గుర్తించిన వ్యక్తులు తమపై ఉన్న అధికారి సాయంతో అక్కడకు చేరుకొని వీరంగం సృష్టిస్తారు. ఆ సమయంలో బేరం కుదిరితే సరేసరి.. లేకపోతే యమభటులు మాదిరి పెద్ద పెద్ద సుత్తులు, గున్నపాములు తీసుకొచ్చి భవనాన్ని నేలమట్టం చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. జీవీఎంసీ గుర్తింపు పొందిన లైసెన్స్‌ సర్వేయర్‌లు ఇచ్చిన నకిలీ ప్లాన్‌లతో భవనాన్ని ప్రారంభించిన యజమానులు ఆశకు పోయి అదనపు అంతస్తులు నిర్మించడానికి రూ.లక్షలు వృథాగా ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వం బీపీఎస్‌ పద్ధతిని ప్రవేశ పెట్టకుండా అనధికార అదనపు అంతస్తులు నిర్మించడానికి టౌన్‌ప్లానింగ్‌ అధికార సిబ్బంది ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారో అంతు చిక్కడం లేదని పలువురు హేలను చేస్తున్నారు. దీనిపై జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలకు ముహుర్తం ఖరారు చేయకపోతే త్వరలో జీవీఎంసీనే తాకట్టు పెట్టే స్థాయికి ఈ టౌన్‌ప్లానింగ్‌ యంత్రాంగం సిద్ధమవుతుందని ఊహాగానం. ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యవస్థపై అవినీతి నిరోధక శాఖ సైతం దృష్టి పెడితే అవినీతి జలగలు పుట్టల పుట్టలుగా పట్టుబడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

  • సిబ్బంది చేష్టలకు చిర్రెత్తిపోతున్న ప్రజలు..

వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్‌ప్లానింగ్‌ చైన్‌మెన్‌ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్‌-4 పరిధిలో పనిచేస్తున్న చైన్‌మాన్‌లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్‌లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్‌లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్‌లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్‌ప్లానింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్‌`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్‌-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.

FashionTravel

పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు..!

– ఇష్టానుసార వసూళ్లతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న ఘరానా దొంగలు..
– ఆశీల గుత్తేదారులు చేస్తున్న చేష్టలకు చిర్రెత్తిపోతున్న వ్యాపారులు..
– జీవీఎంసీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైనం..
– రూ.2లకు బదులు రూ.10లు.. రూ.50లకు బదులు రూ.250లు..
– మూడు వాటాల కోసం కక్కుర్తి పడుతున్న మార్కెట్‌ గుత్తేదారులు..
– ఫిర్యాదు దారుల కోసం కొంగ జపం చేస్తున్న జీవీఎంసీ అధికారులు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): నగర నడిబొడ్డునున్న పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం అప్‌ కమింగ్‌ లీడర్‌గా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి కనుసైగల్లో మెసులుతూ ఫిర్యాదుదారుల వస్తే చర్యలు తీసుకుంటామని కొంగ జపం చేస్తున్నారు. దీంతో పలువురు పీడిత బాధితులు ‘నేత్ర న్యూస్‌’ ప్రతినిధికి ఫిర్యాదు అందించడంతో నిఘా కట్టుదిట్టం చేసి పూర్తి అంశాలను తెలుసుకొని పలు ఆధారాలు సేకరించారు. అసలు విషయం ఏమిటంటే.. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగలు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన ఆస్తి పూర్ణామార్కెట్‌ ఒకటి. ఈ క్రమంలో జోన్‌`4 కార్యాలయ పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగలతో పొల్చుకుంటే ఈ ఏడాది ఘరానా దొంగలకు ఇవ్వడం వలన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు అధికారులే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్‌ నిబంధనలు ప్రకారం స్కూటర్‌ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.150నుంచి రూ.300వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా కూడా లేని రూ.250 రశీదు ఇచ్చి దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.250ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.

– పేరుకి ఒక్కరు, మార్కెట్‌కి ముగ్గురు గుత్తేదారులు..
జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా ఒకరు గుర్తింపు పొందిన పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో మొత్తం ముగ్గురు గుత్తేదారులు వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. 2022`2023కు గాను కాంట్రాక్టర్‌ జి.సత్యనారాయణ రెడ్డి పేరిట గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా రూ.10, రూ.30, రూ.70, రూ.150, రూ.200, రూ.250ల రశీదులతో పాటుగా మరికొన్ని రశీదులు ముద్రించి వసూలు చేస్తున్న గుత్తేదారుడు, అనధికారికంగా రూ.500లకు పైగా వసూలకు పాల్పడుతున్నాడని పలువురు వాహన చోదకులు, వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కీలక వ్యక్తి (అప్‌ కమింగ్‌ లీడర్‌)గా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి భాగస్వామ్యం ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్‌ అవుతున్న మరో వ్యక్తి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.

– రశీదులు ముద్రించి ఇష్టానుసారం వసూళ్లు..
మార్కెట్‌లో దుకాణాలు విక్రయాలు, రహదారిపై అనధికార జంగిడీ వ్యాపారాలు జీవీఎంసీ అధికారులు ఓ తప్పుగా గుర్తిస్తే.. రశీదులు సైతం ముద్రించి ప్రజల నుంచి అక్రమ వసూలకు పాల్పడుతున్న గుత్తేదారులు పలుకుబడితో చేస్తున్న దొంగతనంగానే గుర్తించాలి. సంబంధిత వార్డు కీలక వ్యక్తి సైతం ఆశీల వ్యవహారంలో భాగస్వామ్యం ఉండటం వలనే ఈ తరహా వ్యవహారం జోరుగా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అన్ని అంశాల్లో తనదైన ముద్ర వేసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చే కీలక వ్యక్తి(భాగస్వామ్య గుత్తేదారుడు) తన ముందు రశీదులు ముద్రించి రోజువారీ చేస్తున్న ఈ దొంగతనం కోసం బహిరంగ ఫిర్యాదులు ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

– చర్యలతో పాటుగా త్వరలో కాంట్రాక్ట్‌ రద్దు చేస్తాం..
జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సంబంధిత గుత్తేదారులు రూ.87,20,000, +18.5% మొత్తం సొమ్మును చెల్లించాలి లేదా బ్యాంకు గ్యారెంటీ ఇవ్వల్సి ఉండగా ఎటువంటిది చేయకపోవడం వలన కాంట్రాక్టన్‌ రద్దు చేయడానికి కౌన్సిల్‌ ముంది పూర్తి అంశాలను పెట్టాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం. అధిక ధరలకు సంబంధించి రశీదులు మా దృష్టికి వచ్చాయి. అధిక ధరల నేపధ్యంలో ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
-బీవీ రమణ (జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌).