Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ దక్షిణంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మార్పులు సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో నగరంలో నాలుగు దిక్కుల్లో టీడీపీ ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని మరోమారు కైవసం చేసుకోవడానికి చూస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తరుణంలో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్కుమార్ పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీకి వెళ్ళినా ప్రస్తుత రాజీకీయ పరిణామాలతో దక్షిణం తిరిగి టీడీపీ కైవసం చేసుకుంటుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన కేడర్ బలంగా ఉన్న దక్షిణంలో ఎమ్మెల్యే ప్రజలను మోసగించి తన స్వార్థ ప్రయోజనాలతో పార్టీ మారిపోవడం చాలా మంది ప్రజల జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకి గట్టిగానే బుద్ధి చెప్పాలని దక్షిణ ప్రజలు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో వార్డుల వారీగా పార్టీ కేడర్ని పెంచాల్సిన కార్పొరేటర్లు సైతం పార్టీలో డ్యాన్స్లు వేయడంతో వైసీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందనే చెప్పాలి. నియోజకవర్గంలో పోటీకి సిద్ధమై వార్డులో ప్రజలకు చీరలు, గడియారాలు, క్రీడ వస్తువులు పేరిట పంపిణీ కార్యాక్రమాలు చేయడంతో పాటుగా పలువురు కార్పొరేటర్లకు నల్ల కార్లు బహుమతిగా ఇచ్చి తనవైపు మలుచుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఇప్పటికే పార్టీకి గుడ్బాయ్ చెప్పడం మరో ఉత్కంఠకి తెరతీసింది. అక్కడితో వదిలిపెట్టకుండా ప్రెస్మీట్లు పెట్టి పార్టీపై వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీ పెద్దలు కన్నెర్ర చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో సీతంరాజుకి బజన చేసే కార్పొరేటర్ బృందంలో నలుగురు కార్పొరేటర్లను సైతం పార్టీ పక్కన పెట్టడం దక్షిణంలో రాజకీయం వేడి వేడిగా మారింది. నల్ల కార్లు తీసుకున్న మోజులో ముగ్గురు పక్కన ఉన్నా ఆ నలుగురు కార్పొరేటర్లు పైపైకి ఎగరడంతో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెంపి పక్కన పడేసింది.