Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్-4లో టౌన్ప్లానింగ్ రింగ్ మాస్టర్లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్ప్లానింగ్ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4 టౌన్ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్-4 టౌన్ప్లానింగ్ సిబ్బంది, వార్డు ప్లానింగ్ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్ప్లానింగ్ చైన్మెన్ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్-4 పరిధిలో పనిచేస్తున్న చైన్మాన్లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్ప్లానింగ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్ప్లానింగ్ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్మాన్ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం: నగరంలో టౌన్ కొత్తరోడ్డు ప్రాంతంలో కొలువైవున్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం రథోత్సవానికి సిద్ధమవుతోంది. జులై 1 నుంచి స్వామి తొలిరథయాత్ర ప్రారంభం రథయ కానుంది. తిరుగురథయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ కార్యనిర్వాహణాధి కారిణి సాదనాల ప్రసన్నలక్ష్మీ, ఓ ప్రకటనలో తెలిపారు.
– జగన్నాథ స్వామివారి ఆలయ చరిత్ర..
నగరంలోని శ్రీజగన్నాథస్వామి దేవాలయానికి 190 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ.1832లో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రాంతంలో గరుడా జగన్నాయకులు వారి కుటుంబీకులు తవ్వకాలు జరిపినప్పుడు ప్రస్తుతం దేవాలయం ఉన్నచోట మహావిష్ణువు రూపుడైన రంగనాథ స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. దీంతో స్వామికి చిన్న తాటాకుల పందిరి వేసి దాంట్లో చలమయ్య దీక్షితులు అర్చకులుగా నియమించారు. ఆ తరువాత గరుడ వంశీయుల ఆరాధ్యదైవమైన జగన్నాథస్వామికి ఆలయం నిర్మించడానికి పూనుకొని క్రీ.శ. 1862లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ నుంచి శ్రీజగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్టించారు. 1864 నుంచి నేటి వరకు రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
– రథం చూడటానికి రారండయ్..!
ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విదియ రోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ప్రారంభిస్తారు. ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయం నుంచి ట్రర్నర్ సత్రం వరకు రథోత్సవం నిర్వహించి, సత్రంలో పదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.
ఆ ప్రాంతంలో స్వామివారు దశావతారాల్లో భక్తులకు
దర్శనమిస్తారు.
– దశావతారాల్లో జగన్నాథ స్వామి..
జులై 1న స్వామివారి తొలి రథయాత్ర
2 – మత్స్యావతారం
3 – కూర్మావతారం
4 వరాహావతారం
5 – నృసింహావతారం
6 వామనావతారం
7 – పరశురామావతారం
8 – రామావతారం
9 – బలరామ, కృష్ణావతారం
10 – శేషపాన్పు అవతారం
11 – తిరుగు రథయాత్ర
– స్వామి దర్శనానికి బస్సు సౌకర్యం..
స్వామివారి రథోత్సవం సందర్భంగా టర్నర్ సత్రం (గుండిచా దేవి ఆలయం)లో ఈనెల 01 నుంచి 11వ తేదీ వరకు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 6, 6సీ, 12, 123, 14, 16, 1729, 20, 20, 25, 258, 256, 2508, 256/65. 253, 36, 48, 48, 526, 52, 528, 525/5, 60, 60సీ, 60హెచ్, 64ఎ, 65ఎఫ్, 66వ, 99, 99ఎ/సీ, 993, 333 నెంబరు గల బస్సులు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయి.
– ఏర్పాట్లు ముమ్మరం చేశాం..
ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా ప్రత్యేక దర్శనం రూ.20, శీఘ్ర దర్శనం రూ.50, విశిష్ఠ దర్శనం రూ.200ల దర్శన లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. గుండిచా దేవి ఆలయం (టర్నర్ సత్రం) వద్ద ఎటువంటి పైరవీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోజువారీ 500నుంచి వెయ్యి మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. – సాదనాల ప్రసన్నలక్ష్మీ (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).