Please assign a menu to the primary menu location under menu

Tag Archives: #spa

Crime

నగర వ్యాప్తంగా ‘స్పా’ లపై పోలీసుల దాడులు

  •  స్పా ముసుగులో చేసే గలీజ్‌ దందాపై కొరడా ఝళిపించిన సీపీ రవి శంకర్‌..
  •  ఏక కాలంలో అన్ని స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తున్న పోలీసు బృందాలు..
  •  వందల మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక తనిఖీలకు ఆదేశించిన నగర సీపీ..
  •  ప్రత్యేక విభాగాలతో పాటుగా స్థానిక స్టేషన్‌ సిబ్బంది సైతం దాడులకు హాజరు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్‌లపై పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభించిన దాడులు ఉరుకులు పరుగుల నడుమ జరుగుతునే ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏజీడీ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ నాటి నుండే తనదైన శైలిలో విధులు నిర్వహించడం ప్రారంభించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాలి. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన విభాగంలో ప్రత్యేక నిఘా కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేసిన విషయం మరిచిపోక ముందే రెండు రోజుల క్రితం నగరంలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేసిన తీరుతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో తన సిబ్బందితో పాటుగా నగరంలో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆయన ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసుకున్న టాస్క్‌ని సిబ్బందికి ఇచ్చారు. నగరంలో చట్ట విరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలను గుర్తించి దాడులకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా గల బ్యూటీ స్పాలు, మసాజ్‌ సెంటర్‌లపై ఏక కాలంలో దాడులు నిర్వహించడానికి పదుల సంఖ్యలో బృందాలను సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. స్పెషల్‌ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌, ఇంటెలిజెన్సీ విభాగ సిబ్బందితో పాటుగా స్థానిక స్టేషన్‌ స్థాయి నేర విభాగ, శాంతిభద్రతల సిబ్బందిని సైతం కలుపుతూ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెంటర్‌లపై దాడులు నిర్వహించిన సిబ్బంది కీలక ఆధారాలు సైతం స్వీకరించడంతో పాటుగా పలువురు వ్యభిచార ముఠాలను, విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు బాగోట..

  • నగర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి..
    స్పా సెంటర్‌లలో జరుగుతున్న కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ తనదైన శైలిలో దాడులకు ఆదేశాలు ఇచ్చారు. తన సిబ్బందికే ముందస్తు సమాచారం లేకుండా ఏక కాలంలో అందరికీ సమాచారం అందించి బృందాలను సిద్ధం చేశారు. సీఐలు, ఎస్సైలతో కూడిన బృందాలు ఒకేసారి దాడుల్లో పాల్గొనే విధంగా పథకం వేశారు. ఆదివారం.. పైగా రాత్రి సమయం.. కావడంతో చాలా మంది అసాంఫీుక కార్యకలాపాల్లో పాల్గొని పట్టుబడతారనే నెపంతో రాత్రి 7గంటల సమయంలో దాడులు ప్రారంభించారు. ఈ తరహాలో ఒకేసారి నగర వ్యాప్తంగా స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి. దాడులపై పూర్తి వివరాలు ఉన్నతాధికారులు త్వరలో వెల్లడిరచనున్నారు.