Please assign a menu to the primary menu location under menu

Tag Archives: SKML

DevotionalPolitical

కనకమ్మ ఆలయంలో పైరవీల పర్వం

  • బురుజుపేట కనకమ్మ ఆలయంలో తీవ్ర ఇబ్బందులకు గురైన భక్తులు..
  • స్థానిక ఎమ్మెల్యే అనుచరుల చేష్టలకు చిర్రెత్తి పోయిన భక్త జనం..
  • ఆలయంలో భజన బృందాన్ని తలపించిన పోలీసు బృందాలు..
  • సమిష్టి కృషితో అమ్మవారి ఆదాయాన్ని లక్షల్లో గండికొట్టిన వైనం..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మార్గశిర మాస మహోత్సవాల్లో రెండోవ గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాధిగా తరలివచ్చారు. తొలి పూజతో ప్రారంభమైన విశేష పంచామృతాభిషేకాలు భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమేపి అధికమవ్వడంతో క్యూలైనుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సర్వదర్శనం క్యూలైనులో భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కనకమ్మను దర్శించుకునేందుకు సూధూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆలయ కార్యానిర్వాహక అధికారిణి చేసిన ఏర్పాట్లును ఓవైపు దేవాదాయశాఖ సిబ్బంది, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. దీంతో ఎక్కడక్కడ క్యూలైన్‌ల్లో కుమ్ములాట జరిగింది. రూ.500 దర్శన మార్గంలో అడుగడుగున అక్రమ మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ వారే హుందాతనాన్ని అనుభవిస్తూ క్యూలైన్‌లను తొలిగించి తమ అనుచర గణాన్ని దర్శనానికి తీసుకెళ్లడంతో రూ.500 టికెట్‌ని కొనుగోలు చేసిన భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపించింది. ఒకేసారి పదుల సంఖ్యలో పక్కదారి నుంచి పట్టుకుపోతున్న తీరుని సాధారణ భక్తులు జీర్ణించుకోలేక ఆసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో చెదురుమదురు ఘటనలు ఎదురవ్వకూడదని ముందుగానే సూచనలు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలను సైతం దిగువ స్థాయి సిబ్బంది తుంగలో తొక్కి కద్దర్‌ చొక్కాలకు, బంధు ప్రీతికి లొంగిపోవడంతో అసలు సమస్య ఎదురైయిందని అమ్మవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

  • ఎమ్మెల్యే పేరుని ఆయన అనుచరులే దిగజార్చారు..!
    • ఆలయంలో రద్ధీ పెరుగుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడంతో అదును చూసుకొని ఆయన అనుచరులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. గత వారం మాదిరిగానే ఈ గురువారం కూడా గుంపులు గుంపులుగా వాళ్ల బంధువులను, చోటా మోటాలను అక్రమ మార్గంలో దర్శనానికి తీసుకెళ్లడంతో సుధూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ ఉద్యోగంలో ఉన్న దేవాదాయశాఖ సిబ్బంది అయితే రాజకీయ పలుకుబడికి భయపడుతూ నిమ్మకుండిపోయారు. ఇక పోలీసు సిబ్బంది అయితే భజన బృందాన్ని తలపించే విధంగా ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సంరక్షణలో దిగువ స్థాయి సిబ్బంది సైతం అక్రమ మార్గంలో వచ్చే అనుచర వర్గానికి వత్తాసు పలకడం గమనార్హం.
  • సేవ ముసుగులో అమ్మవారి ఆదాయం లక్షల్లో గండి కొట్టారు..!
    • అమ్మవారి మార్గశిర మహోత్సంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా దేవాదాయ దర్మదాయ శాఖ సిబ్బందితో పాటుగా పలు సేవా సంస్థలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వారిపై అటుగా పర్యావేక్షణ లేకపోవడంతో అమ్మవారి ఆదాయానికి గండి పడిరది. సేవా సంస్థలు పదుల సంఖ్యలో సేవ చేయడానికి సిబ్బందిని ఆలయంలో నియమిస్తే వేలాది మంది సేవా వస్త్రాలతో, మెడలో గుర్తింపు కార్డులతో రూ.500 దర్శన క్యూలైనుల్లో హల్‌చల్‌ చేశారు. సేవ చేయడానికి లోపలికి వెళ్తున్నామని అమ్మవారి దర్శనానికి దర్జాగా వెళ్లి అమ్మవారి ఆదాయానికి గండి కొట్టారు. దీనికి తోడుగా ఆలయ దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది బంధు ప్రీతితో చేసిన చేష్టలు సాధారణ భక్తుల దర్శనానికి చాలా సమయం పట్టి చెమటలు పట్టించాయి. ఇదే మార్గంలో పోలీసు వర్గం దేవాదాయ శాఖ సిబ్బందితో పోటి పడుతూ క్యూలైనుల్లో తమ శైలి చూపించడంతో అమ్మవారి ఆదాయం రూ.లక్షల్లో గండి కొట్టినట్టు ఇట్టే అర్థం అయిపోతుంది.
  • క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంలో లోపాలు కనపిస్తున్నాయి..
    • అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు వస్తున్న క్రమంలో సంబంధిత అధికారులు తీసుకున్న జాగ్రత్తలు మరింత ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఏడాది కొత్త ఆలయ కార్యానిర్వాహక అధికారిణికి అన్ని అంశాలు వివరిస్తూ నిర్మించాల్సిన క్యూలైన్‌ల్లో చాలా అక్రమ మార్గాలు ఏర్పాటు చేయడం మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సాధారణ భక్తులతో పాటుగా రూ.500 టికెట్‌ తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటువంటి టికెట్‌ తియ్యకుండా వచ్చే చొరబాటుదారులు మాత్రం రాజభోగంతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని పలువురు భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు.

Government

ఆలయంలో అక్రమ కొలువులు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ) : బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పైరవీల పర్వానికి తెరతీశారు. ఆలయంలోకి అక్రమ మార్గంలో చొరబడే భక్తులను కట్టడి చేయాల్సిన ఉద్యోగులే అక్రమ మార్గంలో వస్తుంటే అమ్మవారి ఆదాయాన్ని రక్షించే నాథుడు ఎవరని భక్తులు గుసగుసలాడుకుంటున్నారు. ఆలయంలో నిత్యం చెదురు మదురు ఘటనలతో అమ్మవారి ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు ఇప్పుడు ఏకంగా కొలువుల వర్షం కురిపిస్తూ అమ్మవారి ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. గతంలో స్థానికంగా విధులు నిర్వహించిన ఓ ఈవో తన వాహనానికి డ్రైవర్‌ కావాలని ఒకరికి ఉద్యోగం ఇస్తే.. ఆ తరువాత వచ్చిన మరో ఈవో నేనేం తక్కువ తినలేదని అక్కడ ఉన్న డ్రైవర్‌ని ఉపయోగించుకోకుండా మరో కొత్త డ్రైవర్‌ని నియమించుకొని ఘనత సృష్టించారు. ఇదే క్రమంలో కొత్తగా ఓ మంత్రి పైరవీ చేశారని ఒకరికి అక్రమ మార్గంలో ఉద్యోగం ఇచ్చిన అధికారులు హాజరు పుస్తకంలో పేరుని నమోదు చేస్తే.. స్థానిక ఎమ్మెల్యే తరుపున మరో ఉద్యోగం కేటాయించమని ఆలయంలో ఓ వ్యక్తి ప్రదక్షిణలు చేయడంతో పాటుగా ఆలయానికి వచ్చే భక్తులపై అధికారం సైతం చలాయిస్తున్నాడు. ఇక ఈ తంతును చూసిన ఆలయ ఛైర్మన్‌ తరుపున మరో రెండు ఉద్యోగాలు కేటాయించి తన వాటాను సైతం ఉపయోగించుకున్నారు. ఇదే మార్గంలో ఓ ఆలయాధికారి తాము ఏమీ తక్కువ తినలేదని తమకు ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడే ఓ మహిళకు సైతం ఏడాది క్రితం ఉద్యోగం కేటాయించిన ఘనత శ్రీకనకమహాలక్ష్మి ఆమ్మవారి ఆలయంలోనే చెల్లింది.

 

  • కొలువుల కల్పనకు కొత్త కొత్త కుట్రలు..
    ఆలయంలో కొత్తగా కొలువులు కేటాయించడానికి అక్కడి అధికారులు వేస్తున్న ఎత్తు పైఎత్తులు ఆశ్చర్యాన్ని కల్గించే విధంగా ఉన్నాయని పలువురు ఉద్యోగులు మాటల్లోనే తేటతెల్లం అవుతుంది. ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసే వ్యక్తికి కాపాలదారిగా విధులు కేటాయిస్తే.. శుభ్రం చేసే వ్యక్తి ఉద్యోగం వేసే అవకాశం పుట్టుకొచ్చిందని, డ్రైవర్‌గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తికి అన్నదానంలో ఉద్యోగం కేటాయిస్తే కొత్త డ్రైవర్‌ని సృష్టించొచ్చని అక్కడి అధికారుల మాటాల్లో స్పష్టంగా అర్థం అవుతుంది. ఏది ఏమైన ఒక ఏడాదిలో సుమారు ఏడుగురుకి ఉద్యోగాలు కేటాయించి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధికారులు పెద్ద మనసు చాటుకుంటున్నారని పలువురు హేళన చేస్తున్నారు.

 

  • వర్గ పోరులో ఆలయ ఆదాయానికి గండి..
    కనకమ్మ ఆలయంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఉద్యోగులు, స్థానికంగా పలుకుబడి కోసం పాకులాడుతున్న చోటా మోటా నాయకులు, ఒకవైపు ఆలయ అధికారులు.. మరోవైపు ప్రజా ప్రతినిథులు.. ఇలా ఒక్కరా..? ఇద్దరా..? కంటికి కనిపించే అందరూ వర్గాలుగా ఏర్పడి ఆలయంలో పెత్తనం చలాయిస్తున్నారు. ఒకరు ఉద్యోగం వేశారని మరొకరు.. మరొకరు ఉద్యోగం వేశారని ఇంకొకరు.. ఇలా అందరూ అక్కడ చేస్తున్న చేష్టల వలన అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఇట్టే అర్థం అవుతుంది. దీనిపై గతంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లిన నేటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైయిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  • ఉద్యోగాలు కేటాయించాలంటే పద్ధతి ప్రకారమే..
    ఆలయంలో ఉద్యోగాలు కేటాయించాలంటే ఎవ్వరికైనా ఒకటే పద్ధతి. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పారని కేటాయించడం జరగదు. ఏది ఏమైన పద్ధతి ప్రకారమే జరుగుతుంది. మాకు వచ్చిన అర్జీలను పరిశీలించి దేవాదాయశాఖ కమిషనర్‌ దృష్టిలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి అనుమతి వస్తేనే తాత్కలిక పద్ధతిలో ఉద్యోగం కేటాయిస్తాం. నా దృష్టికి ఇంత వరకు ఇటువంటి అంశాలు రాలేదు. దిగుస్థాయి సిబ్బందితో చర్చించి తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. -కె శిరీష (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).
Devotional

కనకమ్మ ఆలయంలో కస్సు బుస్సులు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.. కొంగు బంగారం చేసే తల్లి.. బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస మహోత్సవ ఏర్పాట్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 24నుంచి డిసంబర్‌ 23వరకు జరుగు మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశామని సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. సంబరాలకు సంబంధించిన విషయాలను వెల్లడిరచడానికి శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్మకర్తల మండలి సభ్యుల వర్గం, ఆలయ అధికారిక వర్గం మధ్యలో జరిగిన ఘర్షణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించిందంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ఆలయంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న విభేదాల ఉత్సవం విలేకరుల సమావేశంలో బహిరంగం అయిపోయింది. ఒక వర్గం ప్రత్యర్థి వర్గంపై దాడి చేసే విధంగా మాట్లాడంతో మరో వర్గం దీటుగా ఎదుర్కొన్నట్టు మాట్లాడటం వలన కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారిణి చేస్తున్న వ్యవహారంలో రెండేళ్ల పాటుగా ఉండే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదని ఆవేదనతో ఆ వర్గం పెద్దగా గొడవ చేయడంతో.. అన్ని అంశాల్లో గౌరవ స్థానాన్ని కేటాయిస్తున్నామని ఆలయ ఈవో సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య జరిగిన విశ్లేషణాత్మక విద్వాంశంలో విలేకరులు పెద్దల పాత్రను పోషించారు. ధర్మకర్తల మండలి సభ్యుల్లో.. సభ్యులకు ఇప్పటి వరకు సవాలక్ష తగాదాలు ఉండగా ఆ వ్యవహారం కాసంత ముదిరి ఆలయ అధికారులకు కూడా తాకడంతో రెండు వర్గాలుగా తయారవ్వడంతో అసలు తంతు ఇక్కడే మొదలైంది.

  •  ఆలయంలో ఎడ మొహం.. పెడ మొహం..
    బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో ఆలయ అధికారిణి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఇరువురు ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నారని ముందు నుంచే పలు సంకేతాలు కనిపిస్తునే ఉన్నాయి. దీనికి సైతం ఆలయంలో జరుగుతున్న వ్యవహారాల్లో తనకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ఓ వాదన వినిపిస్తుంటే.. చైర్మన్‌ చేసిన చేష్టలు వలన సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కఠినంగా వ్యవహరించడమని మరో వాదన సైతం గట్టిగానే వినిపిస్తుంది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి దత్తత దేవాలయమైన అంబికాబాగ్‌ కల్యాణ మండపం వ్యవహారంలో ఈవో శిరీష కఠినంగా వ్యవరించడమే దీనికి కారణమని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో అంబికాబాగ్‌ ఆలయంలో గల కల్యాణ మండపాన్ని ప్రస్తుత చైర్మన్‌ పదవిలో ఉన్న కొల్లి సింహాచలం తన కుమారుడు కొల్లి శ్రీను పేరిట బహిరంగ వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఆ తరువాత రెండు నెలల్లో ఏర్పాటు అయిన ధర్మకర్తల మండలిలో చైర్మన్‌ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో అసలు గొడవ అక్కడ మొదలైందనే చెప్పాలి. ఆలయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ.. ఆలయ ఉద్యోగులు కానీ.. వాళ్ల కుటుంబ సభ్యులు కానీ.. ఆలయ ఆస్తులను గుత్తేదారు పద్దతిలో ఇచ్చేటి వంటి అంశాల్లో ఉండకూడదని ఎండోమెంట్‌ ఏక్ట్‌లో ఉందని పలువురు ఇప్పటికే ఫిర్యాదులు సైతం చేశారు. ఇదే క్రమంలో తన ప్రత్యర్థి సైతం విశాఖ జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ పెద్దలతో పాటుగా దేవాదాయశాఖ అధికారులకు సైతం ఈ విషయం అర్థం అయ్యే విధంగా అన్ని ఆధారాలు, ఏక్ట్‌లతో అర్జీలు సైతం పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

 

  • ధర్మకర్తలకు పెద్ద పీట వేస్తున్నాం..
    శనివారం ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమవేశంలో తమకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ధర్మకర్తల మండలి సభ్యులు వెల్లడిరచారు. దీనికి స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష స్పందిస్తు ధర్మకర్తల మండలి సభ్యులకు పెద్దపీట వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. మార్గశిర మాస మహోత్సవాలకు సంబంధించిన స్వాగత పత్రాల్లో చైర్మన్‌కి ప్రత్యేకంగా ఫొటో ముద్రించలేదని వచ్చిన చిన్నపాటి సమస్య చాలా అంశాలకు దారి తీసిందని తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మీటింగ్‌కి తమని పిలవలేదని ఆరోపించిన ధర్మకర్తల మండలి సభ్యులు జేసీ వద్ద నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ ఫొటోల్లో ఎలా ఉన్నారని, బయట డిపార్టుమెంట్‌ల కో`ఆర్డినేషన్‌ మీటింగ్‌లో ఆలయంలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న కమిటీలకు సంబంధించిన వ్యక్తులను జేసీకి పరిచయం చేయలేదని మరోమారు ఆగ్రహం వ్యక్తం చేయడం సరి కాదని అన్నారు. బయట వ్యక్తులకు సంబంధించిన అంశాల్లో ఆలయ అంశాలు చర్చించడం సరైన పద్ధతి కాదని, ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు చెప్పినట్టు నడుచుకుంటే ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా మార్గశిర మాసం సమయంలో ఫ్రీ పాస్‌లు ఇవ్వాలని, దీనికి తోడు విలేకరుల సమావేశానికి ప్రత్యేకంగా పిలవలేదని ఆరోపించడం సభువుకాదని ఈవో శిరీష వెల్లడిరచారు. ఆలయంలో ఉన్న చిన్నపాటి సమస్యలు ఆలయంలో మీటింగ్‌ పెట్టి తమలో తాము పరిష్కరించుకోవాలని, బహిరంగంగా గొడవలు పెట్టు కోవడం వలన ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తాను ఇక్కడ విధులు నిర్వహించే వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తానని, ఎటువంటి ఒత్తుళ్లకు లొంగేది లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 

  •  అబింకాబాగ్‌ ఆదాయానికి పంగనామం..
    శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అయిన అంబికాబాగ్‌ ఆలయ ఆదాయానికి పంగనామం పెడుతున్నారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆలయంలో కొంత భాగాన్ని కల్యాణమండపం పేరిట విభజించి గుత్తేదారు పద్ధతిలో గత ఏడాది అక్టోబర్‌లో అద్దెకు ఇచ్చారు. నెలకు సుమారు రూ.2.5లక్షల అద్దె నిమిత్తం కైవసం చేసుకున్న ఆలయ చైర్మన్‌ గత నాలుగు నెలలుగా సుమారు రూ.10లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికి గాను సంబంధిత అధికారులు ఈనెల 7న నోటీసులు సైతం జారీ చేశారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ఆరోపణలు చేస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఆలయ చైర్మన్‌ స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ.. ఆలయానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ సంబంధం ఉండకూడదని ఎండోమెంట్‌ ఏక్ట్‌లో ఉన్నా అటుగా ఏ అధికారి పట్టించుకోకపోవడం అయోమయానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఆలయ లావాదేవీల్లో ఉన్న వ్యక్తలకు ఎటువంటి పదవులు ఉండకూడదని, చైర్మన్‌ పదవి సైతం తొలిగించాలని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ధర్మకర్తల మండలి సభ్యుల్లో ఓ నేత తన భార్యకి చైర్మన్‌ పదవిని కేటాయించాలని ఇప్పటికే ఓ మంత్రి వద్దకు పలుమార్లు పరుగులు కూడా పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

  • ఉత్సవాల్లో పైరవీలకు రంగం సిద్ధం..
    కనమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే మార్గశిర ఉత్సవాల్లో పైరవీలు చేయడానికి ధర్మకర్తల మండలి సభ్యులు సిద్ధమైపోయారు. సంబంధిత ఉన్నతాధికారితో పెద్దగా గొడవ పెట్టుకొని తమ పేరుని ముద్రించిన లెటర్‌హెడ్‌లు భక్తులు తీసుకొస్తే రూ.500ల విశిష్ట దర్శనం క్యూలైనుల్లో ఉచిత దర్శనం కల్పించాలని అర్జీ సైతం పెట్టుకున్నారు. దీనికి గాను సంబంధిత ఈవో నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో గత ఉన్నతాధికారుల సాయంతో పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.