Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: PM PALEM POLICE

Crime

పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : దొంగల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే రక్షణ కరువయ్యింది. స్టేషన్‌లో భద్రపరిచిన కీలక రికార్డులు కనిపించలేదని ఇప్పటికే ఆ స్టేషన్‌ అధికారికి సైతం తెలియజేయడంతో ఎక్కడ ఉన్నతాధికారులకు తెలిసిపోతుందోనని తర్జన భర్జన పడుతున్నారు. నిత్యం రద్ధీగా ఉండే పోలీసు స్టేషన్‌ల్లో ఒకటైన పీఎంపాలెం స్టేషన్‌లో 41ఏ నోటీసు (స్టేషన్‌ బెయిల్‌) ఇచ్చే రికార్డు పుస్తకం గత రెండు రోజులుగా కనిపించడం లేదని ఆలస్యంగా వెలుగు చూసింది. స్టేషన్‌లో జరిగే లావాదేవీల్లో సిబ్బంది మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో ఈ రికార్డులు మాయం అయినట్టు స్టేషన్‌లో సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అన్ని అంశాల్లో నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టు స్టేషన్‌ లేఖరి వ్యవహరించడంతో దర్యాప్తు అధికారులు(ఐవో)గా కేసులు నమోదు చేస్తున్న కొందరు సిబ్బంది తస్కరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టేషన్‌ దర్యాప్తు అధికారులు ఎందుకు దొంగిలించాలి..? ఆ అవసరం వాళ్లకి ఏంటో..? అని ఆరా తియ్యగా స్టేషన్‌ ఖర్చులకు ఓపెన్‌ డ్రిరకింగ్‌లు, రెస్టారెంట్‌లు, బార్‌లు, బిల్డర్‌లు, ఓయో రూమ్‌ల నుంచి నెలవారీ వచ్చిన సొమ్ము సరిపోవడం లేదని, అప్పుల్లో మునిగిపోతున్నానని ఏకంగా స్టేషన్‌ లేఖరి స్థానంలో ఉన్న వ్యక్తి 41ఏ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవ్వడంతో అక్కడ సమస్య తలెత్తింది. తమకి వచ్చిన ఆ వాటలో ఆయన ప్రమేయం ఇష్టం లేక కొందరు సిబ్బంది మాయం చేసారా..? లేదా స్టేషన్‌కి వచ్చిపోయేవారు ఎవరైనా తీసుకెళ్లిపోయారా..? అని అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పకే సిబ్బంది అందర్నీ ప్రశ్నిస్తున్నారు.

  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే భారీ జరిమానా..!?

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని, అటుగా మద్యం సేవించిన వ్యక్తులను స్టేషన్‌కి తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ అనంతరం కోర్టులో జరిమానాలు చెల్లించాలని తెల్సిందే.. కానీ ఈ పోలీసు స్టేషన్‌లో మాత్రం కోర్టులో చెల్లించిన జరిమానాల కంటే.. స్టేషన్‌లో చెల్లించిన జరిమానాలు అధికంగా ఉంటాయని అక్కడి రికార్డులను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. రోజుకి పదుల సంఖ్యలో ఓపెన్‌ డ్రిరకింగ్‌ (ఓడీ)లను తీసుకొచ్చినట్టు చూపిస్తూ.. కోర్టుకు మాత్రం ఒంటరి సంఖ్యల్లో జరిమానాలకు పంపించడం అక్కడ సాధారణ విషయంగా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని తీసుకొచ్చి వాళ్ల నుంచి సెల్‌ఫోన్‌లు తీసున్నారు. స్టేషన్‌కి పలుమార్లు తిప్పించడంతో వాళ్లకి సమయం లేదని త్వరగా వెళ్లిపోవాలంటే ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున రూ.6వేలు చెల్లించాలని దౌర్జన్యంగా తీసుకున్నట్టు బాధితులు బోరుమన్నారు. ఇదే క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తాటికళ్లు సేవిస్తుండగా పోలీసు సిబ్బందికి పట్టుబడటంతో స్టేషన్‌కి తరలించారు. కోర్టుకి వెళ్లి రూ.3వేలు చెల్లించాలని, స్టేషన్‌లో అయితే రూ.5వేలు చెల్లిస్తే వెంటనే వదిలేస్తామని చెప్పడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అడిగింది చెల్లించి అక్కడ నుంచి జారుకున్నారు.

  • సిబ్బందిపై నిఘా పెట్టారు..!

నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌. శంఖబ్రత బాగ్చీ రోజుకి సుమారు 20గంటలు శ్రమించి ప్రజలకు చేరువులో ఉండటానికి ప్రయత్నిస్తుంటే.. దిగువస్థాయి సిబ్బంది ప్రజలను పట్టి పీడిస్తున్నారనడానికి ఉదాహరణ సీపీ వద్దకు రోజుకి సుమారు 85మందికి పైగా రావడమే. స్టేషన్‌లో సరైన న్యాయం దొరకడం లేదని ఆయన వద్దకు వచ్చి బోరుమంటున్నారు.

స్టేషన్‌లో జరుగుతున్న రోజువారీ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నగర పోలీసు కమిషనర్‌ సిబ్బంది చేస్తున్న చేష్టలపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ మధ్య స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందిని మార్పులు చేసినా ఎటువంటి సమాచారం రావడం లేదని ఆయన గ్రహించి ఇప్పటికే ఇద్దర్ని స్థానచలనం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. స్టేషన్‌ల వారీగా జనరల్‌ సిబ్బంది చేస్తున్న పనులు, నెలవారీ వసూలు చేస్తున్న అంశాలు తనదైన శైలిలో సీపీ తెలుసుకొని త్వరలో కొరడా రaళిపించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ప్రజల రక్షణతో పాటుగా సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఆయన సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా పెట్టారని విశ్వసనీయ సమాచారం.