Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: PDS RICE

Government

అధికారుల అండతో చీకటి వ్యాపారం

  • పౌర సరఫరా శాఖ సమక్షంలో పీడీఎస్ గోల్.. మాల్..
  • రేషన్ బియ్యం అక్రమ విక్రయాల్లో చేదోడు వాదోడు..
  • చూసి చూడ నందుకు నెలవారీ మామ్మూళ్లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్‌ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్‌-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్‌-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్‌ రైస్‌ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.

 

  • ఉన్నతాధికారుల నిఘా నీరు కారిపోతుంది..
    సర్కిల్‌ పరిధిలో డిఫోలు, ఎండీయూల నుంచి పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పడుతుందని రోజువారీ వందల ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో దిగువ స్థాయిలో ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌లు దండీగా దండుకుంటున్నారని సమాచారం. నెల చివరిలో వచ్చే జీతాల కంటే నెలవారీ వచ్చే మామ్మూళ్లుపై మక్కువ పెంచుకొని విధులు నిర్వహించడంతో అక్రమ విక్రయాలపై దృష్టి కేంద్ర్రీకృతం చేయలేకపోతున్నారని బహిరంగ రహస్యం. రోజువారీ సమీక్షలు నిర్వహించి దండిరచాల్సిన ఉన్నతాధికారులు సైతం చోద్యం చూడటంతో నిఘా నీరు కారిపోతుంది.

 

  • పీడీఎస్‌ అక్రమ విక్రయాలతో దండీగా దుడ్లు..
    పేదల బియ్యాన్ని పేదవాడికి అందించకుండా మిల్లులకు అక్రమంగా తరలించడంలో పౌర సరఫరా శాఖ సిబ్బంది, వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ దాడుల పేరిట పీడీఎస్‌ వ్యాపారులు, డిఫో డీలర్లు, ఎండీయూల నుంచి అందినకాడికి దోచుకోవడంలో సిద్ధ హస్తులుగా నిలుస్తున్నారు. ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చే బియ్యం పేదవాడికి అందకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు తరలించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బంది దండీగా దుడ్లు సంపాధిస్తున్నారని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది.

 

  • నెలలో పదిరోజులు పండగ చేసుకుంటున్నారు..
    ప్రతీ నెలలో మొదటి పది రోజులు పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. గిడ్డంగుల నుంచి రేషన్‌ డిపోలకు తరలించిన బియ్యం డిపోల్లో కొత్త ప్యాకింగ్‌లతో సిద్ధమై దర్జాగా మిల్లులకు ప్రయాణమవుతున్నాయంటే వ్యవస్థలో లోపాలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు సైతం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని పలువురు పేద ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
CrimeGovernment

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం: పేదలకు అందించాల్సిన పీడీఎస్‌ రైస్‌ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాది పాటుగా ఉచితంగా ఇవ్వవలసిన బియ్యం, సబ్సిడీలో ఇవ్వవలసిన పప్పు, పంచదార, గోదుమ పిండి సైతం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయంటే అశ్చర్యపడనవసరం లేదు. ఓ దొంగ వ్యాపారి సరికొత్త బ్యాండ్‌ బ్యాగ్‌లను తయారు చేసి రైస్‌ మిల్లు నుంచి దుకాణాలకు తరలిస్తున్నట్టు రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి పక్కకు తరలిస్తుంటే మరో వ్యాపారి పాత సంచుల్లోనే సామాగ్రిని తరలించినట్టు మూడో కంటికి కనిపించకుండా బియ్యాన్ని చక్కగా మిల్లులకు తరలిస్తున్నారు. మరి కొందరు వ్యాపారస్తులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు రాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఎండీయూ వాహనాల్లోనే నార సంచుల్లో బియ్యాన్ని మిల్లులకు పంపించి పని కానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలు ఫిర్యాదులు అందించినా అటుగా పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారని బహిరంగంగానే పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్‌ విభాగ దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల సైతం ఈ నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఉండటంతో పక్కదారి పడుతున్న పేదల బియ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ విజయ ప్రతాప్‌ రెడ్డి రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటుగా విశాఖలో కూడా అకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులతో పాటుగా డీలర్స్‌, ఎండీయూ సిబ్బందిని సైతం చమటలు పట్టించిన ఘటనలు మరువక ముందే తిరిగి జోరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే పీడీఎస్‌ బియ్యం వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా ఒకటి రెండు కేసులను నమోదు చేసి రోజుకి వేల సంఖ్యలో బస్తాలు పక్కదారి పడుతున్నా అటుగా పట్టించుకోలేని వ్యవస్థ ఉన్నంత వరకు బియ్యన్ని అక్రమ మార్గంలో తరలించి, ఫ్యాన్సీ నెంబర్‌ కారుల్లో తిరుగుతన్న పెద్దల పబ్బం గడుస్తునే ఉంటుంది. ఈ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మరోమారు అక్రమార్కుల అంతు చూస్తే నాణ్యమైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం పేదలకు చేరుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • ఎవ్వరికి వారే యమునా తీరే..
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించే ఫలాల్లో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఇంటి వద్దకు అందిస్తామని చెప్పిన మాటలు.. మాటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నెలవారీ వేలకు వేలు ఇస్తూ పోషిస్తున్న ఎండీయూ వ్యవస్థ సైతం పాత డీలర్లు మాదిరి కాసుల కోసం కక్కుర్తి పడటంతో రేషన్‌ బియ్యం పేద ప్రజలకు చేరకుండానే పక్కదారి పడుతున్నాయి. ఎవ్వరికి వారే కేజీకి రెండు, మూడు రూపాయల కమిషన్‌ వ్యాపారాన్ని నమ్ముకొని బియ్యాన్ని అమ్ముకోవడంతో ప్రభుత్వం చేసిన రూ.కోట్ల ఖర్చు వృధాగా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి తయారైయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

 

  • నెలవారీ మామ్మూళ్లు మత్తులో నిఘా బృందాలు..
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించే సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయా..? పక్కదారి పడుతున్నాయా..? అని చూసే నిఘా బృందాలు సైతం మామ్మూళ్లు మత్తులో మునిగిపోవడంతో ప్రభుత్వ అందించే పథకాలు ప్రజలకు చేరకుండానే నీరు కారిపోతున్నాయి. పీడీఎస్‌ రైస్‌, సబ్సిడీ కంది పప్పు, పంచదార, గోదుమ పిండి వంటి వస్తువులు పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయని తెలిసి కూడా స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆ క్రింద ఉన్న పర్యావేక్షణాధికారి, ఏఎస్‌వోలు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు చోద్యం చూస్తున్నారంటే.. అక్కడే ఉన్న పోలీసు విభాగ అధికారులు.. ఆ పక్కనే ఉన్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు సైతం చోద్యం చూడటంపై నెలవారీ మామ్మూళ్ల మత్తు అధికంగా ఉందనే చెప్పాలి. డీలర్‌లు, దొంగ వ్యాపారులు, మిల్లు యజమానులు నుంచి వచ్చే నెలవారీ సొమ్మును లెక్కబెట్టుకోవడంలో నిఘా బృందాలు నిమగ్నమైపోవడంతో ప్రభుత్వ పథకాలు నీరు కారిపోతున్నాయి.

  •  నిఘా బృందాలు పనిచేస్తున్నాయి..
    ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పక్కదారి పట్టకుండా నిఘా బృందాలు పనిచేస్తునే ఉన్నాయి. కానీ ఆ బృందాల్లో సైతం అవినీతి ఉండటంతో వాళ్లపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి. సక్రమ మార్గంలో వ్యవస్థలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం.  -ఓ అధికారి.