Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: LNA

GovernmentPolitical

స్థానిక పత్రికలపై పక్షపాతం తగదు

– పెండింగ్ అక్రిడేషన్లు తక్షణమే జారీ చేయాలి..
– జర్నలిస్టులపై ఐ అండ్ పీఆర్ అధికారులు, సిబ్బంది వివక్ష, వేధింపులు తగదు..
– జిల్లా కలెక్టర్ కు లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ వినతి..

నేత్ర న్యూస్, విశాఖపట్నం: నిబంధనలకు లోబడి స్థానిక పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు అక్రిడేషన్ల జారీ చేయడంలో అన్యాయం జరుగుతుందని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ) ప్రతినిధి బృందం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక దినపత్రికలు, పిరియాడికల్స్ లో పని చేస్తున్న జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం దరఖాస్తులు చేసుకొని రెండేళ్లు అవుతున్న ఇప్పటి వరకు చాలా మందికి జారీ చేయలేదని కలెక్టర్ కు తెలిపారు. కొన్ని డైలీ దిన పత్రికలకు నిబంధనల ప్రకారం 20 అక్రిడేషన్లు రావాల్సి ఉండగా పదిలోపే పరిమితం చేసారని వివరించారు.

పీరియాడికల్స్ కు రెండు అక్రిడేషన్లు రావాల్సి ఉండగా ఒకటికే పరిమితం చేశారని తెలిపారు. చాలా పత్రికలకు ఆ మాత్రం కూడా ఇంత వరకు ఇవ్వకుండా వివక్ష చూపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులను మాయం చేయటం, కొన్ని దరఖాస్తులను స్వీకరించకపోవడం, అక్రిడేషన్ల జారీలో తీవ్ర జాప్యం పాటిస్తున్నారని ఆయనకు తెలిపారు.

సమాచార, పౌర సంబంధాల శాఖలో అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు సమాచారాన్ని పైస్థాయి అధికారులకు అందజేస్తూ అక్రిడేషన్ల జారీకి అడ్డుపడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తో ఫోన్ లో వెంటనే మాట్లాడారు. నాలుగు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని, కొందరికి ఇచ్చి కొందరకు నిరాకరించారనే ఆరోపణలు రాకూడదని ఆదేశించారు. అక్రిడేషన్ లకు సంబంధించిన సమాచారాన్ని రాతపూర్వకంగా జర్నలిస్టులకు అందజేయాలని తెలిపారు. అదే విధంగా అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ జీవో 142 సవరణ, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, అక్రిడేషన్ల జారీకి జీఎస్టీ నిబంధన రద్దు, కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత తదితర జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన మరో వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి పంపే నిమిత్తం కలెక్టర్ కు అందజేశారు.

దీన్ని ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లను కలిసిన లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంలో అధ్యక్షుడు పి. సత్యనారాయణ, కార్యదర్శి ధవళేశ్వరపు రవికుమార్, ప్రతినిధులు నిట్టల శ్రీనివాస్, బి. నారాయణరావు, బి. శివప్రసాద్, హరనాథ్, మహేష్, అర్.అబ్బాస్, చక్రవర్తి, బి.ఎ. నాయుడు, ఎస్.సన్యాసిరావు, శివ కుమార్ రెడ్డి, ఎం.శ్రీహరి తదితరులు పాల్గున్నారు.

GovernmentPolitical

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

– పెండింగ్ లో ఉన్న ప్రెస్ అక్రిడేషన్లను వెంటనే జారీ చేయాలి..
– జర్నలిస్టులకు 300గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..
– లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఏ) సర్వసభ్య సమావేశంలో నేతలు డిమాండ్..

నేత్ర న్యూస్, విశాఖపట్నం : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని ద్వారకానగర్ లో గల పౌర గ్రంధాలయంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు లోబడి పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడేషన్లు నిరాకరించడం తగదని, పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లను తక్షణమే జారీ చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.

అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5లక్షల పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. స్థానిక దిన పత్రికలకు, పిరియాడికల్స్ కు తగినన్ని సమాచారం, పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల చేసి ఆయా పత్రికల చేయూతనివ్వాలన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు అమలు చేయడం లేదని, జీఎస్టీ నిబంధన వలన స్థానిక పత్రికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తక్షణమే తొలగించాలన్నారు.

అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.నారాయణ రావు మాట్లాడుతూ అక్రిడేషన్ లకు సంబంధించిన జీవో నెంబర్-142ను సవరించి జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. హేమ సుందర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు నెలకు 5వేలు పెంక్షన్, ఉచితంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అర్.అబ్బాస్, చక్రవర్తి, రవికాంత్, వెంకట వేణు, తిర్లంగి హరి, శివప్రసాద్, జి.ఆనంద్, హరనాథ్, దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు, బి.ఏ.నాయుడు, మొల్లి కమల్ కుమార్, వి.గణేష్, నాయుడు యాదవ్, భగవాన్, ఎం.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.