Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగరంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ‘టాస్క్ఫోర్స్’ పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రక్షణకై ఏర్పాటైన ఈ విభాగం ఇటీవల కాలంలో రాజకీయ పెద్దల అండదండలతో ‘నీరు కారిపోతోందా’ అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడితో సంబంధిత సిబ్బంది అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు సైతం టాస్క్ఫోర్స్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. నేరాల నియంత్రణలో, వ్యవస్థీకృత నేరాలను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఈ ప్రత్యేక బృంద సభ్యులు కొన్ని కీలక కేసుల్లో ఎందుకు పలచబడిపోతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనుక కేవలం నిర్లక్ష్యమా..? లేక తెరవెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా..? అన్నది అంతుబట్టకుండా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో పాతనగరం సమీప ఓ పెద్ద క్లబ్లో పేకాట నగదుతో ఆడుతున్నట్టు నగదుతో పాటుగా లెక్కింపు యంత్రం సైతం బోర్డుపై లభించింది. ఆ సమయంలో దాడులు నిర్వహించగా కొన్ని క్షణాల్లో శాసనసభలో కీలక నేత పైరవీతో అక్కడకక్కడే వదిలి వెళ్లిపోవల్సి వచ్చింది. ఇదే విధంగా గాజువాక ప్రాంతంలో ఓ క్లబ్లో దాడులు నిర్వహించగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో మరోమారు వదిలిపెట్టి వెళ్లిపోయారు. టాస్క్ఫోర్స్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో కొన్ని హోటల్స్లో పేకాటలు ఆడుతున్నట్టు సమాచారం అందుకోని దాడిచేసిన కొన్ని నిమిషాల్లో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్కాల్ రావడంతో వచ్చిన వేగంతోనే వెనక్కి వెళ్లిపోవడం సాధారణ విషయంగా మారిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో పలుమార్లు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించే సమయంలో సాక్ష్యాత్తు మన ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో పట్టుకొని వదిలిపెట్టిన సందర్భాలు కోకొల్లలు.
ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందిన టాస్క్ఫోర్స్కి ఓ ఏసీపీ స్థాయి అధికారి అవసరం ఎంతైనా ఉంది. నగర వ్యాప్తంగా గల 23 పోలీసు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించాల్సిన విభాగంలో కేవలం ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై ఉండటంతో టాస్క్లు నిర్విహించిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడం లేదు. డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారుల పర్యావేక్షణలో పని చేస్తున్నా.. స్టేషన్ల పరిధిలో దాడులు చేసే సమయంలో సీనియర్ సీఐలు మాట టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న సీఐలు, ఎస్సై అప్పుడప్పుడు కొట్టలేకపోవడం ఓ కారణం అయితే.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఒత్తిడితో నిమ్మకుండిపోవడం సాధారణంగా జరుగుతుంది. పైగా రెండు జోన్లకు ఒకే ఎస్సై ఉండటం కూడా పని ఒత్తిడిలో కీలక టాస్క్లు వదిలిపెట్టడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. గతంలో ఏసీపీ స్థాయి అధికారి ఉన్నప్పటికి ప్రస్తుతానికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, గతంలో దాడులు చేయాలంటే గోప్యత ఉండేదని, ప్రస్తుతం ముగ్గురి చర్చల్లో కాలం చెల్లిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
టాస్క్ఫోర్స్ విభాగ పనితీరు నగరంలో ఈ మధ్య జరిగిన రెండు, మూడు కీలక సంఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థమయిపోతుంది. నగర బహిష్కరణ చేసిన ఓ రౌడీ షీటర్ ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడుతూ ఓ భూ దందా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎట్టకేలకు సీపీ కార్యాలమంలో బాధితులు బోరుమనడంతో సంబంధిత స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో రుషికొండ సమీపంలో ఎండీఎం డ్రగ్స్ని విక్రయం చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. తీవ్ర రాజకీయ ఒత్తిడితో ఇద్దరు నిందితులను జైలుకి సాగనంపిన సిబ్బంది మరో ఇద్దరు నుంచి భారీ మొత్తంలో దండుకొని ఉచ్చులో ఎర(డెకాయ్)గా ఉపయోగించామని నమ్మించి వదిలిపెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇరువురు నిందితులు మరో వ్యాపార విషయంలో గొడవ పడటంతో ఒకడ్ని మరొకడు బెదిరించడంతో టాస్క్ఫోర్స్లో చేతివాటం చూపించి ఇరువుర్ని వదిలిపెట్టిన ఆ అధికారి వద్దకు వచ్చి బోరుమన్నాడు. దీంతో ఇరువురు నిందితులను పిలిచి నచ్చచెప్పినట్టు సంబంధిత ఖాకీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. గతంలో వారానికి ఓమారు నగరంలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం, స్టేషన్ల వారీగా నిఘా కట్టుదిట్టం చేయడంతో పాటుగా టాస్క్ఫోర్స్ నుంచి ప్రత్యేక నిఘా ఉండేది. ప్రస్తుతం అటుగా కౌన్సిలింగ్లు నిర్వహించకపోవడంతో పలు హత్యకేసుల్లో నిందితుడిగా గుర్తింపు పొంది నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్ టాస్క్ఫోర్స్ స్టేషన్కి కూతవేటు దూరంలో తన ప్రతాపాన్ని చూపించి పోలీసులకు సవాల్ విసిరిన నాలుగు రోజులకు మేల్కొన్నారు.
స్టాండిరగ్ కమిటీ తీర్మానం లేకుండా జీవీఎంసీ ఆస్తుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే కీలక మార్కెట్లు ప్రస్తుతం దొంగల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇంటి దొంగల సంరక్షణలో ఉండాల్సిన ఆస్తులను సైతం కమీషన్లకు కకుర్తిపడి బయట దొంగలకు అప్పగించినట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తరహా తంతుని చూసి ప్రశ్నించాల్సిన స్థానిక స్టాండిరగ్ కమిటీ సభ్యుడు సైతం ఆ ముఠాలతో చేతులు కలిపినట్టే కనిపిస్తుంది. ఏడాదికి రూ.కోటికి పైగా అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్, సుమారు రూ.30లక్షలకు పైగా అందించే రామకృష్ణ కూరగాయల మార్కెట్ ఈ ఏడాది అంతర్గత లెక్కలు లెక్కించిన అధికారుల లెక్కల ప్రకారం పూర్ణామార్కెట్ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్తో కలిపి రూ.97.28లక్షలకు, అదే రామకృష్ణ కూరగాయల మార్కెట్ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్తో కలిపి రూ.23.10లక్షలకు బహిరంగ వేలం పాట ద్వారా ఖరారు చేశారు. ఈనెల మొదటి నుంచి పాట పాడిన వ్యక్తులకు అప్పగించడానికి కుతూహలంతో ఉన్న జోనల్ స్థాయి అధికారులు స్టాండిరగ్ కమిటీ తీర్మాణం లేకుండానే ఇవ్వడం వెనుక మర్మం ఏంటో అని మార్కెట్లో వ్యాపారులే ఆసక్తి చూపుతున్నారు. బయట సమాజాన్ని నమ్మించడానికి 15మంది సచివాలయ కార్యదర్శిలు, ముగ్గురు మజ్దూర్లను, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక పబ్లిక్ అండ్ హెల్త్ ఉద్యోగిని నియమించినట్టు గతనెల 29న సంతకాలు చేసి ఆదేశాలను జారీ చేశారు. కానీ వాస్తవానికి ఈ ఉద్యోగులు ఈనెల 1నుంచి నేటి వరకు అదే జోనల్ కార్యాలయ సీసీ కెమెరాల పరిధిలోనే పనిచేసినట్టు రికార్డింగ్లు సంబంధిత విభాగంలోనే భద్రపరిచి ఉండటం కొసమెరుపు. నకిలీ అదేశాలను జారీ చేసిన అధికారులు అటుగా సిబ్బందిని కేటాయించిన స్థానంలో పని చేస్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో సైతం ఉంటే బాగుండేదని పలువురు వ్యాపారులు హేళన చేస్తున్నారు.
జీవీఎంసీలో జరిగిన ఆర్థిక లావాదేవీలను స్టాండిరగ్ కమిటీ తీర్మాణంతో కేటాయించాల్సి ఉన్నా.. జోన్-4 రెవెన్యూ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏడాదికి రూ.కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పూర్ణామార్కెట్, రూ.30లక్షలకు పైగా ఆదాయాన్ని ఇచ్చే రామకృష్ణ కూరగాయల మార్కెట్ని ఎటువంటి అనుమతులు లేకుండా జీవీఎంసీ కమిషనర్ పేరిట టోకెన్లను ముద్రించి బయట వ్యక్తులకు అప్పగించారు. నామ మాత్రంగా బృందాలను కేటాయించి పూర్తిస్థాయిలో బయట వ్యక్తులతో ఆశీలు వసూళ్లు చేయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమ సిబ్బంది మాత్రమే వసూలు చేస్తున్నారని వివరిస్తున్న అధికారులు ఇప్పటి వరకు జీవీఎంసీ సౌకర్యంలో ఎంత మొత్తంలో జమ చేశారో లెక్కలు చూపించాలని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. స్టాండిరగ్ కమిటీ అనుమతి కూడా లేకుండా బయట వ్యక్తులతో రెండు మార్కెట్ల్లో వసూలు చెయిస్తున్నారంటే సంబంధిత అధికారులు ఎంత మొత్తంలో నకిలీ బృందాల నుంచి వసూలు చేశారో లెక్కలు చూడాల్సి ఉంది.
ఆశీల పాటను నిర్వహించిన అధికారులు గెజిట్ లెక్కల ఆధారంగా వసూలు చేయాలని గుత్తేదారులకు ముందుగానే అవగాహన పరుస్తారు. వాటికి అనుగుణంగానే అధికారులు వాళ్లకు పాటను కేటాయించి అటుగా వసూళ్లు చేయాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు అక్రమ మార్గంలో ఆశీల వసూళ్లకు అవకాశం కల్పించి ఇష్టానుసారంగా దండుకుంటున్నా అటుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్ణామార్కెట్లో ద్విచక్ర వాహనానికి రూ.10, కార్లుకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ వాహనాలకు రూ.300, సరుకులు రవాణాకు ఉపయోగించే వాహనాలకు రూ.200 దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. రామకృష్ణ కూరగాయల మార్కెట్లో రూ.20కి బదులుగా దుకాణానికి రూ.50, రహదారిపై తాత్కాలికంగా వ్యాపారం చేసి వెళ్లిపోయే రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150వరకు వసూలు చేస్తున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. గెజిట్లో లెక్కలను పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ప్రధాన మార్గంలో గోడలకు మాత్రమే పరిమితం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే పూర్ణామార్కెట్ ప్రధాన రహదారిపై తొలిగించిన వ్యాపారాలు యధావిధిగా పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్థానిక నాయకున్ని మంగళవారం తీసుకొచ్చి ఆశీలు వసూళ్లు చేయడానికి అర్హత లేని గుత్తేదారులు రహదారిపై దండలతో సన్మానాలు చేసి ఆయన్ని మచ్చిక చేసుకుంటున్నారు. మనిషికి రెండు జంగిడీల చొప్పున కేటాయించి వ్యాపారాలు జరపడానికి చూస్తున్నారు. ఈ జంగిడీలు రహదారిపై పెట్టి వ్యాపారం చేస్తే గుత్తేదారులకు అక్షరాల రూ.40లక్షల వరకు లాభం వస్తుందని మాజీ గుత్తేదారులు సైతం వెల్లడిస్తున్నారు. వ్యాపారులపై ఉన్న ప్రేమ కంటే రూ.40లక్షలపై ఎక్కువ ప్రేమ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర గగనతలంలో పోలీసు డ్రోన్లు పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇప్పటికే సంబంధిత పోలీసు సిబ్బందికి డ్రోన్లు పనితీరుకి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నేర నియంత్రణ, ట్రాఫిక్ రద్దీ, పోలీసు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని పోలీసు విధుల్లో సైతం ఉపయోగించడం వలన మరింత ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన ఈ డ్రోన్ పోలీసింగ్పై దృష్టి కేంద్రికృతం చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ నుంచి సీఎస్ఆర్ పేరిట కొన్ని డ్రోన్లను పోలీసు విభాగానికి కేటాయించడంతో నగర ఆకాశ వీధిల్లో డ్రోన్లు జోరు వేగంతో విధులు నిర్వహిస్తున్నాయి.
మందు బాబులు, అల్లరి మూకలు, ధూమపానం, గంజాయి బ్యాచ్లకు ఇక నుంచి చుక్కలు కనిపించనున్నాయి. ఆకాశంలో చుక్కల మాదిరి చక్కర్లు కొడుతూ గుంపులను చెల్లాచెదురు చేయడంతో పాటుగా హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు సేకరించి కేసులు నమోదు చేయడానికి పోలీసు డ్రోన్లు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపాటి సందులు, కొండ ప్రాంతాలు అనే వ్యత్యాసాలు లేకుండా ఒకే రకమైన పోలీసు సేవలు అందించడానికి ఈ డ్రోన్లు సిద్ధమయ్యాయి. గోల్డెన్ మినిట్స్లో కీలక అంశాలను సేకరించడంతో పాటుగా భద్రపరిచి కేసులు పరిష్కారం దిశగా ఈ డ్రోన్లు వేగంగా పని చేస్తున్నాయి. నగరంలో 23పోలీసు స్టేషన్లకు ఒకటి, రెండు చొప్పున అక్కడి వ్యాసార్థం బట్టి బ్లూకోల్ట్స్, డీకోల్ట్స్, మొబైల్, రక్షక్ పేరిట విధులు నిర్వహిస్తున్న విభాగాలకు దీటుగా ఈ డ్రోన్లు పరుగులు 24గంటలు పెట్టనున్నాయి. నిర్జన, సంక్షోభిత ప్రాంతాల్లో పోలీసు సైరన్ అలార్ట్లతో హెచ్చరికలు జారీ చేయడం, నిందితులను వెంబడిరచడానికి డ్రోన్లు వేగంగా ఎగురుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో డ్రోన్ సేవలు అందించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విశాఖ సిటీ సీపీ బాగ్చీ వెల్లడిస్తున్నారు.
గొడవలు, అల్లర్లు జరిగే ప్రాంతాల్లో సిబ్బంది వెళ్లే సమయాని కంటే ముందుగా పరుగులు పెట్టడానికి ఈ డ్రోన్లు మెరుగ్గా పని చేయనున్నాయి. వాహనాలు వెల్లడానికి వీలు లేని ప్రాంతాల్లో సైతం త్వరితగతిన వెల్లడంతో పాటుగ ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు చిత్రికరించి కేసులు వేగవంతంగా చేయడానికి ఆధారాలు సేకరిస్తాయి. వీఐపీల రాకపోకలపై నిఘా కట్టుదిట్టం చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరిమూకలను చెల్లాచెదురు చేయడం, రహదారులపై ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేయకుండా అనుక్షణం కనిపెడుతునే ఉంటాయి. ఈ డ్రోన్లు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే శాంతిభత్రల సమస్యలు చాలా వరకు సర్ధుమనుగుతాయని విశాఖ పోలీసులు ప్రయోగాత్మకంగా చూపించనున్నారు.
నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, సిబ్బంది కొరత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, నేర నియంత్రణలో డ్రోన్ సేవలు చాలా కీలకంగా ఉండనున్నాయి. ప్రమాదాల నివారణతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ డ్రోన్లు విధులు నిర్వహించడం. ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ధూమపానం, గంజాయి, మందు బాబుల బృందాలను చెదరగొట్టడంతో పాటుగా కేసులు నమోదు చేయడానికి కీలక ఆధారాలు సేకరిస్తాయి. నిర్మాణుష ప్రాంతాలతో పాటుగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో 24గంటలు నిఘా కట్టుదిట్టం చేయడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న డ్రోన్లను త్వరలో అన్ని స్టేషన్లకు కేటాయించడానికి పలు ప్రైవేటు సంస్థలతో సీఎస్ఆర్ పద్ధతిలో తీసుకోవడానికి పోలీసు వర్గాలు సిద్ధమయ్యాయి.
విశాఖ సిటీలో గత పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా శాంతిభత్రలు దృష్ట్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాళ్ల భద్రతే ధ్యేయంగా నాతో పాటుగా అందరు సిబ్బంది పని చేయాలి. అటుగా ఇప్పటికే చాలా సేవలు ప్రారంభించాం. ఈ క్రమంలో డ్రోన్ పోలీసింగ్ ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రయోగాత్మక స్థితిలో ఉన్న డ్రోన్ పోలీసింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటుగా పరిష్కారానికి డ్రోన్ పోలీసింగ్ కీలకంగా మారుతుంది. నగర ప్రజలకు శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర విభాగాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా నా 79950 95799 ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. – డాక్టర్. శంఖబ్రత బాగ్చీ (విశాఖ సిటీ పోలీసు కమిషనర్).
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : దొంగల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు స్టేషన్లోనే రక్షణ కరువయ్యింది. స్టేషన్లో భద్రపరిచిన కీలక రికార్డులు కనిపించలేదని ఇప్పటికే ఆ స్టేషన్ అధికారికి సైతం తెలియజేయడంతో ఎక్కడ ఉన్నతాధికారులకు తెలిసిపోతుందోనని తర్జన భర్జన పడుతున్నారు. నిత్యం రద్ధీగా ఉండే పోలీసు స్టేషన్ల్లో ఒకటైన పీఎంపాలెం స్టేషన్లో 41ఏ నోటీసు (స్టేషన్ బెయిల్) ఇచ్చే రికార్డు పుస్తకం గత రెండు రోజులుగా కనిపించడం లేదని ఆలస్యంగా వెలుగు చూసింది. స్టేషన్లో జరిగే లావాదేవీల్లో సిబ్బంది మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో ఈ రికార్డులు మాయం అయినట్టు స్టేషన్లో సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అన్ని అంశాల్లో నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టు స్టేషన్ లేఖరి వ్యవహరించడంతో దర్యాప్తు అధికారులు(ఐవో)గా కేసులు నమోదు చేస్తున్న కొందరు సిబ్బంది తస్కరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టేషన్ దర్యాప్తు అధికారులు ఎందుకు దొంగిలించాలి..? ఆ అవసరం వాళ్లకి ఏంటో..? అని ఆరా తియ్యగా స్టేషన్ ఖర్చులకు ఓపెన్ డ్రిరకింగ్లు, రెస్టారెంట్లు, బార్లు, బిల్డర్లు, ఓయో రూమ్ల నుంచి నెలవారీ వచ్చిన సొమ్ము సరిపోవడం లేదని, అప్పుల్లో మునిగిపోతున్నానని ఏకంగా స్టేషన్ లేఖరి స్థానంలో ఉన్న వ్యక్తి 41ఏ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవ్వడంతో అక్కడ సమస్య తలెత్తింది. తమకి వచ్చిన ఆ వాటలో ఆయన ప్రమేయం ఇష్టం లేక కొందరు సిబ్బంది మాయం చేసారా..? లేదా స్టేషన్కి వచ్చిపోయేవారు ఎవరైనా తీసుకెళ్లిపోయారా..? అని అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పకే సిబ్బంది అందర్నీ ప్రశ్నిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని, అటుగా మద్యం సేవించిన వ్యక్తులను స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో జరిమానాలు చెల్లించాలని తెల్సిందే.. కానీ ఈ పోలీసు స్టేషన్లో మాత్రం కోర్టులో చెల్లించిన జరిమానాల కంటే.. స్టేషన్లో చెల్లించిన జరిమానాలు అధికంగా ఉంటాయని అక్కడి రికార్డులను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. రోజుకి పదుల సంఖ్యలో ఓపెన్ డ్రిరకింగ్ (ఓడీ)లను తీసుకొచ్చినట్టు చూపిస్తూ.. కోర్టుకు మాత్రం ఒంటరి సంఖ్యల్లో జరిమానాలకు పంపించడం అక్కడ సాధారణ విషయంగా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని తీసుకొచ్చి వాళ్ల నుంచి సెల్ఫోన్లు తీసున్నారు. స్టేషన్కి పలుమార్లు తిప్పించడంతో వాళ్లకి సమయం లేదని త్వరగా వెళ్లిపోవాలంటే ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున రూ.6వేలు చెల్లించాలని దౌర్జన్యంగా తీసుకున్నట్టు బాధితులు బోరుమన్నారు. ఇదే క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తాటికళ్లు సేవిస్తుండగా పోలీసు సిబ్బందికి పట్టుబడటంతో స్టేషన్కి తరలించారు. కోర్టుకి వెళ్లి రూ.3వేలు చెల్లించాలని, స్టేషన్లో అయితే రూ.5వేలు చెల్లిస్తే వెంటనే వదిలేస్తామని చెప్పడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అడిగింది చెల్లించి అక్కడ నుంచి జారుకున్నారు.
నగర పోలీసు కమిషనర్ డాక్టర్. శంఖబ్రత బాగ్చీ రోజుకి సుమారు 20గంటలు శ్రమించి ప్రజలకు చేరువులో ఉండటానికి ప్రయత్నిస్తుంటే.. దిగువస్థాయి సిబ్బంది ప్రజలను పట్టి పీడిస్తున్నారనడానికి ఉదాహరణ సీపీ వద్దకు రోజుకి సుమారు 85మందికి పైగా రావడమే. స్టేషన్లో సరైన న్యాయం దొరకడం లేదని ఆయన వద్దకు వచ్చి బోరుమంటున్నారు.
స్టేషన్లో జరుగుతున్న రోజువారీ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నగర పోలీసు కమిషనర్ సిబ్బంది చేస్తున్న చేష్టలపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ మధ్య స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని మార్పులు చేసినా ఎటువంటి సమాచారం రావడం లేదని ఆయన గ్రహించి ఇప్పటికే ఇద్దర్ని స్థానచలనం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. స్టేషన్ల వారీగా జనరల్ సిబ్బంది చేస్తున్న పనులు, నెలవారీ వసూలు చేస్తున్న అంశాలు తనదైన శైలిలో సీపీ తెలుసుకొని త్వరలో కొరడా రaళిపించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ప్రజల రక్షణతో పాటుగా సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఆయన సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా పెట్టారని విశ్వసనీయ సమాచారం.
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): ఆ అధికారి ఆడిన ఆటలో అమాయక సిబ్బంది సతమతమవుతున్నామని ఏకంగా పోలీసు బాస్కే ఫిర్యాదుల పరంపర నడపడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయనపై కోపంతో ఓ కానిస్టేబుల్ కొన్ని రోజులు కనిపించకుండా పోవడం సాధారణంగా విషయంగా తీసుకుంటే.. సీఐ స్థానంలో ఉన్న మహిళా అధికారి పరుగులు పెడుతూ పోలీసు కమిషనర్కి ఫిర్యాదు చేయడం అసాధారణమైన విషయంగానే పరిగణించాలని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది. మొదటి నుంచి ఆ అధికారి మాట తీరు, వ్యవహార శైలి సక్రంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల దండనకు గురవ్వడమే కాకుండా పలుమార్లు సస్పెండ్ అయినా ఆయన తీరు ఏ మాత్రం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంచలంచలుగా పెరుగుతూ అధికారి హోదాకి వచ్చినా కాసంత కూడా కనికారం లేదని కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు మరో కొత్త అలవాటు రావడంతో సిబ్బంది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయ్యిందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెల్ఫోన్లతో స్టేషన్కి వచ్చిన అధికారి నిత్యం ఓ సెల్ఫోన్లో మార్కెట్ సమయానుగుణంగా ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం, మధ్య మధ్యలో అమ్మాలా..? కొనాలా..? అనే సంభషణలు చేయడం స్టేషన్లో కిటికీలు, తలుపులు సైతం ఓ కంట కనిపెడుతునే ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తిట్టుల దండకం తప్పదని దీనికి సంబంధించిన పూర్తి అంశాలు సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. చీటికి మాటికి సిబ్బందిపై కస్సుబుస్సులు ఆడటంతో సిబ్బంది అక్కడక్కడ
ప్రయత్నించి బదిలీపై వెళ్లిపోవడానికి సైతం సిద్ధమవుతున్నారు. గతంలో హార్బర్ స్టేషన్లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ చలానా పుస్తకాలు సృష్టించి అధిక మొత్తంలో దోచుకోవడం గుర్తించిన అప్పటి పోలీసు బాస్ సస్పెండ్ చేసినా ఆయనలో మార్పు ఏ మాత్రం కనిపించలేదనే చెప్పాలి. అక్కడికి కొన్నేళ్ల తరువాత ఇన్స్పెక్టర్ హోదాలో ఓ కానిస్టేబుల్ని కొట్టడంతో మరోమారు సస్పెండ్ అయినా దిగువ స్థాయి సిబ్బందిని ఏమాత్రం చూసుకోవడం రాలేదనే చెప్పాలి. మరో సంఘటనలో ఈయన చేసిన చేష్టలకు ఓ కానిస్టేబుల్ తుఫాకీ ఎక్కుపెట్టిన ఘటన ఆ రోజుల్లో అందర్నీ భయబ్రాంతులకు గురిచేసినా ఉపయోగం లేదనే చెప్పాలి. ఇదే క్రమంలో నగరంలో కీలక విభాగానికి అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కోర్టు కానిస్టేబుల్పై నిప్పులు చెరగడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఎవ్వరికీ చెప్పకుండా స్టేషన్లో తన వస్తువులు అన్ని వదిలిపెట్టి అటుగా కనిపించకుండా వెళ్లిపోయాడని తోటి సిబ్బంది గుసగుసలాడుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎంపాలెం పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ 558/2024 నమోదు చేసిన కొన్ని రోజుల్లో తిరిగి రావడంతో కథ సుకాంతం అయ్యిందనే సమయానికే ఓ మహిళా ఏఎస్సై తనకు మూడు రోజులు సెలవు కోరిన విషయంలో లేఖలో నన్ను చాలా సార్లు అవమానపరిచారు, ఆడ వాళ్లకి చాలా బాధలు ఉంటాయి అర్థం చేసుకోవాలని ప్రాధేయపడటమే కాకుండా సెలవు ఇవ్వకపోతే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కొసమెరుపు. అదే సమయంలో మరో మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఆసభ్యకరంగా మాట్లాడటం, ఓ కానిస్టేబుల్ని బెధిరించడం చేసిన ఆయనపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతునే ఉంది. స్టేషన్లో మహిళా ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ బాధితురాలు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వచ్చే సన్నివేశాలు పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో తాను కూడా ఎదుర్కొవడంతో నేరుగా ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆయోమయానికి గురిచేసిందనే చెప్పాలి. దీంతో స్పందించిన పోలీసు బాస్ తనపై ఉన్న అధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.
మొదటి నుంచి చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కిందని నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆయన తోటి సిబ్బంది సైతం వెల్లడిస్తున్నారు. నకిలీ ట్రాఫిక్ చలానాలు సృష్టించి జరిమానాలు పక్కదారి పట్టించడం, కేసులకు సంబంధం లేకుండా బస్ వారెంట్లతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించడం వంటి అంశాలు డీజీపీ స్థాయి అధికారి దృష్టిలో ఉన్నా తన తీరుని ఏమాత్రం మార్చుకోకుండా సిబ్బందిపై చిందులు వెయ్యడం ఆయనకే దక్కిందని చెప్పాలి. దీనికి తోడు కొత్తగా ఉద్యోగ సమయంలో వ్యక్తిగత వ్యాపారాలు, పెట్టుబడులపై నిబంధనలు పాటించకుండా సీసీ కెమెరాల పర్యావేక్షణలో స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం అందులో ఎదురయ్యే సంఘర్షణల వలన దిగువ స్థాయి సిబ్బందిపై మండి పడటం ఇప్పటికే పోలీసు బాస్ దృష్టికి పలువురు సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ రామన్న ఉత్తరాలు సైతం వెయ్యడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన ఇటువంటి అధికారి వద్ద పని చేయడం సూది కంటిలో తాను పోయడం లాంటిదని సిబ్బంది బోరుమంటున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : లోక కల్యాణం కోసం మూడు లోకములను మూడు మూడడుగులుగా కొలిచి.. రాక్షస గుణం కలిగిన బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఘటన నాడు ఆ త్రివిక్రముడు (వామనుడు) చేస్తే.. విశాఖ నగరంలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేసి, రూ.లక్షలాది సొమ్మును కాజేస్తూ రాక్షసులుగా ప్రవర్తించిన ముగ్గురు సీఐలను ఈ త్రివిక్రముడు విశాఖ రేంజ్కి బదిలీ చేయడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. గతంలో డీసీపీగా విధులు నిర్వహించిన డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ నగరంలో అన్ని అంశాలను తనదైన శైలిలో తెలుసుకొని పోలీసు కమిషనర్గా అడుగు పెట్టిన నాటి నుంచే తన పని ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు సీఐలను రేంజ్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడమే కాకుండా వాళ్ల స్థానాలను వెంటనే వదిలిపెట్టి రేంజ్ డీఐజీ వద్ద హాజరయ్యే విధంగా చూడాలని సంబంధిత సబ్ డివిజన్ స్థాయి ఏసీపీలకు ఆదేశాలు జారీ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. గత పోలీసు కమిషనర్ హయాంలో నగరంలోకి చొరబడి ఆర్థిక లావాదేవీల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సీఐలను ముప్పై రోజుల్లో గుర్తించి విధుల నుంచి తప్పించడం పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దుర్భాసలాడి బెదిరించిన మేయర్ భర్త గొలగాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం పోలీస్ కమిషనరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆరిలోవలోని తోటగరువు స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా, షాడో మేయర్ గొలగాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాసలాడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి గూబ పగల గొడతానని, సస్పెండ్ చేసి పారేస్తాను అంటూ దుర్భాసలాడిన విషయం అన్ని చానల్లో, పత్రికల్లో వచ్చాయని తెలిపారు. శ్రీనివాస్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, అధికార కార్పొరేటర్ కాదని, వైసీపీ సాధారణ కార్యకర్త అని ఏం అధికారం ఉందని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దారుణంగా దుర్భాషలాడుతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టాలపై పోలీసులపై వైసీపీ నేతలకు గౌరవ లేదని, అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. సాక్షాత్తు పోలీసులను నడి రోడ్డుపై బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఇప్పటికే షాడో మేయర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తూ జీవీఎంసీ అధికారులను బెదిరిస్తూ ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. అదే వేరే పార్టీ వారు ఇలా చేసి ఉంటే ఈ పాటికి కేసులు పెట్టేవారన్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలతో స్పందనలో ఏడీసీపీ రామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని, స్పందించిన ఆయన చర్యలు తీసుకోమని ఆరిలోవ పోలీసులకు ఆదేశించారన్నారు. పోలీసు అధికారుల సంఘం ఇప్పటికైనా స్పందించాలన్నారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.