Please assign a menu to the primary menu location under menu

Political

CrimeGovernmentPolitical

టాస్క్‌ ఫోర్స్‌లో మహా మాయగాళ్లు

కీలక టాస్క్‌ల్లో నిందితులకు సమాచారం చేరవేసి చేతివాటం చూపిస్తున్నట్టు పలు ఆరోపణలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్‌ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్‌ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్‌, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్‌ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్‌ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.

  • టాస్క్‌ ఫోర్స్‌లో ఆ షాడోని పట్టుకోవడం కష్టమా..?

తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్‌, బెయిల్‌ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్‌, డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్‌ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్‌ డబుల్‌ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్‌ దుకాణాలు, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.

  • టాస్క్‌ ఫోర్స్‌లో డైరెక్ట్‌ అధికారి అవసరమే..!

నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్‌ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్‌ స్టేషన్‌ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్‌ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

GovernmentPolitical

ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కిన విద్యాశాఖ

  • పండగ సెలవుల్లో తరగతులను యధావిధిగా కొనసాగిస్తున్న ప్రైవేటు పాఠశాలలు..
  • బూటకపు నోటీసులు జారీ చేసి అటుగా పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు..
  • పాఠశాలలను తనిఖీలు చేయడంలో అలసత్వం చూపిస్తున్న ఎంఈవోలు, సీఆర్‌పీలు..
  • సెలవుల్లో సైతం తరగతులు నిర్వహించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాలు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్‌సీ నెంబర్‌ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్‌ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.

  • ఆదేశాలు తుంగలో తొక్కడంలో విద్యాశాఖ సిబ్బంది సాయం చేస్తున్నారా..?

సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్‌ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్‌పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.

  • పాఠశాలలపై ఫిర్యాదులు ఎన్ని ఇచ్చినా పట్టించుకోరేం..?

తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్‌ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్‌లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్‌లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్‌ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్‌లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్‌పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్‌ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్‌జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

DevotionalPolitical

కనకమ్మ ఆలయంలో పైరవీల పర్వం

  • బురుజుపేట కనకమ్మ ఆలయంలో తీవ్ర ఇబ్బందులకు గురైన భక్తులు..
  • స్థానిక ఎమ్మెల్యే అనుచరుల చేష్టలకు చిర్రెత్తి పోయిన భక్త జనం..
  • ఆలయంలో భజన బృందాన్ని తలపించిన పోలీసు బృందాలు..
  • సమిష్టి కృషితో అమ్మవారి ఆదాయాన్ని లక్షల్లో గండికొట్టిన వైనం..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మార్గశిర మాస మహోత్సవాల్లో రెండోవ గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాధిగా తరలివచ్చారు. తొలి పూజతో ప్రారంభమైన విశేష పంచామృతాభిషేకాలు భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమేపి అధికమవ్వడంతో క్యూలైనుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సర్వదర్శనం క్యూలైనులో భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కనకమ్మను దర్శించుకునేందుకు సూధూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆలయ కార్యానిర్వాహక అధికారిణి చేసిన ఏర్పాట్లును ఓవైపు దేవాదాయశాఖ సిబ్బంది, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. దీంతో ఎక్కడక్కడ క్యూలైన్‌ల్లో కుమ్ములాట జరిగింది. రూ.500 దర్శన మార్గంలో అడుగడుగున అక్రమ మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ వారే హుందాతనాన్ని అనుభవిస్తూ క్యూలైన్‌లను తొలిగించి తమ అనుచర గణాన్ని దర్శనానికి తీసుకెళ్లడంతో రూ.500 టికెట్‌ని కొనుగోలు చేసిన భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపించింది. ఒకేసారి పదుల సంఖ్యలో పక్కదారి నుంచి పట్టుకుపోతున్న తీరుని సాధారణ భక్తులు జీర్ణించుకోలేక ఆసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో చెదురుమదురు ఘటనలు ఎదురవ్వకూడదని ముందుగానే సూచనలు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలను సైతం దిగువ స్థాయి సిబ్బంది తుంగలో తొక్కి కద్దర్‌ చొక్కాలకు, బంధు ప్రీతికి లొంగిపోవడంతో అసలు సమస్య ఎదురైయిందని అమ్మవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

  • ఎమ్మెల్యే పేరుని ఆయన అనుచరులే దిగజార్చారు..!
    • ఆలయంలో రద్ధీ పెరుగుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడంతో అదును చూసుకొని ఆయన అనుచరులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. గత వారం మాదిరిగానే ఈ గురువారం కూడా గుంపులు గుంపులుగా వాళ్ల బంధువులను, చోటా మోటాలను అక్రమ మార్గంలో దర్శనానికి తీసుకెళ్లడంతో సుధూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ ఉద్యోగంలో ఉన్న దేవాదాయశాఖ సిబ్బంది అయితే రాజకీయ పలుకుబడికి భయపడుతూ నిమ్మకుండిపోయారు. ఇక పోలీసు సిబ్బంది అయితే భజన బృందాన్ని తలపించే విధంగా ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సంరక్షణలో దిగువ స్థాయి సిబ్బంది సైతం అక్రమ మార్గంలో వచ్చే అనుచర వర్గానికి వత్తాసు పలకడం గమనార్హం.
  • సేవ ముసుగులో అమ్మవారి ఆదాయం లక్షల్లో గండి కొట్టారు..!
    • అమ్మవారి మార్గశిర మహోత్సంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా దేవాదాయ దర్మదాయ శాఖ సిబ్బందితో పాటుగా పలు సేవా సంస్థలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వారిపై అటుగా పర్యావేక్షణ లేకపోవడంతో అమ్మవారి ఆదాయానికి గండి పడిరది. సేవా సంస్థలు పదుల సంఖ్యలో సేవ చేయడానికి సిబ్బందిని ఆలయంలో నియమిస్తే వేలాది మంది సేవా వస్త్రాలతో, మెడలో గుర్తింపు కార్డులతో రూ.500 దర్శన క్యూలైనుల్లో హల్‌చల్‌ చేశారు. సేవ చేయడానికి లోపలికి వెళ్తున్నామని అమ్మవారి దర్శనానికి దర్జాగా వెళ్లి అమ్మవారి ఆదాయానికి గండి కొట్టారు. దీనికి తోడుగా ఆలయ దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది బంధు ప్రీతితో చేసిన చేష్టలు సాధారణ భక్తుల దర్శనానికి చాలా సమయం పట్టి చెమటలు పట్టించాయి. ఇదే మార్గంలో పోలీసు వర్గం దేవాదాయ శాఖ సిబ్బందితో పోటి పడుతూ క్యూలైనుల్లో తమ శైలి చూపించడంతో అమ్మవారి ఆదాయం రూ.లక్షల్లో గండి కొట్టినట్టు ఇట్టే అర్థం అయిపోతుంది.
  • క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంలో లోపాలు కనపిస్తున్నాయి..
    • అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు వస్తున్న క్రమంలో సంబంధిత అధికారులు తీసుకున్న జాగ్రత్తలు మరింత ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఏడాది కొత్త ఆలయ కార్యానిర్వాహక అధికారిణికి అన్ని అంశాలు వివరిస్తూ నిర్మించాల్సిన క్యూలైన్‌ల్లో చాలా అక్రమ మార్గాలు ఏర్పాటు చేయడం మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సాధారణ భక్తులతో పాటుగా రూ.500 టికెట్‌ తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటువంటి టికెట్‌ తియ్యకుండా వచ్చే చొరబాటుదారులు మాత్రం రాజభోగంతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని పలువురు భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు.

GovernmentPolitical

పూర్ణామార్కెట్ ని దోచేస్తున్నారు..

  • పార్కింగ్‌ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్న గజ దొంగలు..
  • గుత్తేదారులు చేస్తున్న చేష్టలకు చిరాకు పడుతున్న వ్యాపారులు..
  • నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆశీల వసూలుదారులు..
  • రూ.2లకు బదులు రూ.10లు.. రూ.30లకు బదులు రూ.300లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్‌గా గుర్తింపు పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న గుత్తేదారులు అక్కడ ప్రజలను, చిరు వ్యాపారులను దోచుకుంటున్నారని బోరున విలపిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ జీవీఎంసీ తరుపున ఆశీలు వసూలు చేస్తున్నామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక కార్పొరేటర్‌ మాటకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగ గుత్తేదారులు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన

ఆస్తి పూర్ణామార్కెట్‌ ఒకటి. ఈ క్రమంలో జోన్‌-4 కార్యాలయ
పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగల కంటే ముదురు దొంగలకు అప్పగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు దిగువ స్థాయి సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్‌ నిబంధనలు ప్రకారం స్కూటర్‌ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.200నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా లేని రశీదులను ముద్రించి రూ.300వరకు దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.200ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.

– మార్కెట్‌ని దోచుకోవడంలో ముదురులు..

జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా బి.శ్రీరామమూర్తి ఆర్‌సీ నెంబర్‌ 712/2024 పేరిట అధికారం కైవసం చేసుకొని రశీదులు సైతం ముద్రించారు. కానీ ఇక్కడ సమాన వాటాలతో పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు పాటదారులు రింగుగా ఏర్పడి వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా అనధికారికంగా జంగిడీ, తమలపాకుల వ్యాపారుల నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే పండుగ రోజుల్లో అయితే ఇష్టానుసారంగా రూ.500లకు పైగా వసూలు చేస్తున్నారు. పలువురు వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కార్పొరేటర్‌ భాగస్వామ్యం కూడా ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్‌ అవుతున్న మరో ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.

ఎవ్వరైనా ఫిర్యాదు ఇస్తే వెంటనే రద్దు చేస్తాం..

జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఎవ్వరైనా సరే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు, కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం. – ఎం.మల్లయ్య నాయుడు (జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌).

CrimeGovernmentPolitical

జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రచ్చ.. రచ్చ..

విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిస్ట్రార్‌లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..

– కొత్త సిబ్బంది పనితీరు, సమన్వయ లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

పర్సంటేజ్‌లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..

– అన్నీ ఉంటే 0.5% లేకపోతే 1% నుంచి మా ఇష్టమంటున్న మధ్యవర్తులు..

– జిల్లా అధికారికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే మందలింపు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్‌లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్‌ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్‌ రైటర్‌లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్‌ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్‌ రైటర్‌లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్‌లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్‌లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.

  • రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు తెలిసినా చోద్యం ఎందుకు..?
    ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే కీలక వ్యవస్థల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మొదటి ఐదు స్థానాల్లో నిలుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అటువంటి వ్యవహారాలు జరిగే కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అప్పుడప్పుడు చుట్టం చూపుగా చూడటంపై కొందరి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. అన్ని సేవలు ఆన్‌లైన్‌ పేరిట ఉన్నా సంబంధిత వ్యవహారాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎట్టకేలకు కార్యాలయాలకు దూతలుగా వ్యవహరిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్‌లనే ఆశ్రయించి నిలువుదోపిడికి గురవుతున్నారు. ఈ తరహా వ్యవహారాల దృష్ట్య ప్రస్తుత కాలంలో అవినీతి అధికారులని, సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అవకాశం లేదని తెలిసినా సంబంధిత ఏసీబీ అధికారులు అటుగా డాక్యుమెంట్‌ రైటర్‌లపై దృష్టి కేంద్రీకృతం చేయడంలో చోద్యం ఎందుకు అని పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పర్సంటేజ్‌లు పుచ్చుకునే కార్యాలయాల్లో అన్ని అంశాల గురించి పూర్తి అవగాహాన ఉన్న అవినీతి నిరోధక శాఖ చక చక పనులు ప్రారంభిస్తే ఇట్టే అవినీతి తిమింగళాలను పట్టుకోవచ్చు. ఇదే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2.ఓ పరిస్థితికి ముందు చాలా మంది అవినీతి అధికారులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టిన ఘనత ఏసీబీకి చాలా సార్లు దక్కింది. గతంలో ఇదే చోట పనిచేసి పలుమార్లు ఇదే స్థానంలో రావడానికి ఇష్టపడుతున్న అధికారులు, ఎక్కడి స్థానంలో అక్కడ ఉండిపోవడానికి అత్యాశ చూపించే గత సిబ్బంది, ఇదో ఏదో బాగుందే అని పనులు రాకపోయిన నెట్టుకొస్తున్న కొత్త సిబ్బంది తీరుని గమనిస్తే ఎంతటి స్థాయిలో అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం అయిపోతుంది. కార్యాలయ ప్రాంగణంలో అవినీతి జరగకపోయినా అవినీతికి పాల్పడిన అధికారులు దూతల ద్వారా అధిక శాతం కోరుతున్న ఘటనలు ఈ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గోడలు, కిటికీలు నిరంతరం కనిపెడుతునే ఉన్నాయి.
Political

ఆంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

  • ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ..
  • దీపావళి నుంచి అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన..
  • సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడి..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్‌ ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం… ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్ర మంపై నేడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్‌,ఆ శాఖ అధికారులు, చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సమీక్ష జరిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని….దీపావళి నుంచి సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో

వెలుగులు తెస్తుం దని అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా….పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముం దడుగు వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందించడం జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్‌ కనెక్షన్‌ కలిగి, అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఈనెల 24 నుండి బుకింగ్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఈనెల 31వ తేదీ నుండి గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్‌ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని సిఎం అన్నారు. అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారునికి ఈ పథకం రాలేదనే విమర్శ రాకుండా కట్టుదిట్టంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పవర్‌ పాంయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గ్యాస్‌ సిలిండర్‌ రిటైల్‌ మార్కెట్‌ ధర రూ.876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌ కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్‌ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13,423 కోట్ల భారం పడుతుందని వివరించారు.

Political

ఆ నలుగురు..

  • విశాఖ దక్షిణంలో నలుగురు కార్పొరేటర్‌లు ఔట్‌..
  • ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేపై కస్సు బుస్సులు..
  • పార్టీ కేడర్‌ లేక దిక్కుతోచని స్థితిలో ఆ నలుగురు..
  • దక్షిణంలో వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు..
  • అవకాశాన్ని అందుకోవడానికి సీతంరాజు ప్రయత్నం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ దక్షిణంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మార్పులు సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో నగరంలో నాలుగు దిక్కుల్లో టీడీపీ ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని మరోమారు కైవసం చేసుకోవడానికి చూస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తరుణంలో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీకి వెళ్ళినా ప్రస్తుత రాజీకీయ పరిణామాలతో దక్షిణం తిరిగి టీడీపీ కైవసం చేసుకుంటుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన కేడర్‌ బలంగా ఉన్న దక్షిణంలో ఎమ్మెల్యే ప్రజలను మోసగించి తన స్వార్థ ప్రయోజనాలతో పార్టీ మారిపోవడం చాలా మంది ప్రజల జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకి గట్టిగానే బుద్ధి చెప్పాలని దక్షిణ ప్రజలు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో వార్డుల వారీగా పార్టీ కేడర్‌ని పెంచాల్సిన కార్పొరేటర్‌లు సైతం పార్టీలో డ్యాన్స్‌లు వేయడంతో వైసీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందనే చెప్పాలి. నియోజకవర్గంలో పోటీకి సిద్ధమై వార్డులో ప్రజలకు చీరలు, గడియారాలు, క్రీడ వస్తువులు పేరిట పంపిణీ కార్యాక్రమాలు చేయడంతో పాటుగా పలువురు కార్పొరేటర్‌లకు నల్ల కార్లు బహుమతిగా ఇచ్చి తనవైపు మలుచుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ ఇప్పటికే పార్టీకి గుడ్‌బాయ్‌ చెప్పడం మరో ఉత్కంఠకి తెరతీసింది. అక్కడితో వదిలిపెట్టకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి పార్టీపై వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీ పెద్దలు కన్నెర్ర చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో సీతంరాజుకి బజన చేసే కార్పొరేటర్‌ బృందంలో నలుగురు కార్పొరేటర్‌లను సైతం పార్టీ పక్కన పెట్టడం దక్షిణంలో రాజకీయం వేడి వేడిగా మారింది. నల్ల కార్లు తీసుకున్న మోజులో ముగ్గురు పక్కన ఉన్నా ఆ నలుగురు కార్పొరేటర్‌లు పైపైకి ఎగరడంతో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెంపి పక్కన పడేసింది.

  • దూడకు కొమ్ములొస్తే ఊరుకుంటుందా(రా)..?
    దూడకు కొమ్ములొస్తే ఊరుకుంటుందా..? అది చూసిన యజమాని ఊరుకుంటాడా..? ఇదే పరిస్థితి విశాఖ దక్షిణంలో నెలకుంది. పార్టీ కేడర్‌తో కార్పొరేటర్‌లుగా గెలిచి తిరిగి పార్టీకే వ్యతిరేకంగా వ్యవహరిస్తే పార్టీ పెద్దలు ఊరుకుంటారా..? ఎట్టకేలకు పైపైకి ఎగురుతున్న దారాన్ని తెంపి పడేశారు. ‘పక్కనే ఉన్న వ్యక్తులను కాదని పార్టీ సీటులు ఇచ్చి.. పోటీ చేయడానికి నిధులు కేటాయిస్తే’ తిరిగి పార్టీనే వ్యతిరేకంగా చూపిస్తారా..? అని ఓ కీలక నాయకుడి నోట నుంచి వచ్చిన మాటతో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విల్లూరి భాస్కర్‌రావు స్థానిక ఎమ్మెల్యేకి బజన చేసి పార్టీ తీర్థం పుచ్చుకొని వెంటనే ఆ ఎమ్మెల్యేకే పంగనామం పెట్టేశాడు. ఏ దిక్కు లేని దిక్కుమాలినోడ్ని తీసుకొచ్చి పార్టీ సీటు ఇచ్చి పార్టీ పెద్దలు గెలిపించుకుంటే.. మొదటి నుంచి పిచ్చి పిచ్చి చేష్టలతో వార్డు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత సంపాదించుకున్న బిపిన్‌ జైన్‌ సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఉండటాన్ని పార్టీ సహించలేదు. ఇదే క్రమంలో మరో ఇద్దరు ఉరుకూటి నారాయణ, చెన్నా జానకిరామ్‌లకు సైతం దయతో సీటులు కేటాయించి, పెద్ద మొత్తంలో సొమ్మును ఖర్చు చేసి వైసీపీ కార్పొరేటర్‌లుగా గెలిపించుకుంటే మొదటిలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా.. ఆఖరిలో అన్నం పెట్టిన పార్టీకే సున్నం రాసి వ్యతిరేకంగా వ్యవరించి ఆ నలుగురు తమ సీటులను చింపుకున్నారు.

 

  • నల్ల కార్లు మత్తులో పార్టీ కేడర్‌ పోయింది..!
    బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ ప్రారంభం నుంచి దక్షిణంలో చోటుని కైవసం చేసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ గుర్తించి నామినేటెడ్‌ పదవిని కేటాయించి పక్కన పెట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. ఆ తరువాత మారోసారి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి పోటీకి సిద్ధం చేసినా అక్కడ బలహీన పడి తిరిగి యదాస్థితికి చేరుకున్నారు. అదే జోరుతో ముందుగా కార్పొరేటర్‌లకు, కార్పొరేటర్‌లుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు నల్లకార్లు కొనుక్కోమని డౌన్‌ పేమెంట్‌ సైతం ఇచ్చారని బలంగానే వినిపించాయి. దీంతో కార్లు కొనుగోలు చేసిన అందరూ సీతంరాజుకి బజన చేసి పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారని కేంద్ర కార్యాలయం నుంచి ఆ నలుగుర్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కార్లు తీసుకొని బజన చేస్తున్న మరో ముగ్గురు కార్పొరేటర్‌లు, ఓడిన అభ్యర్థుల పరిస్థితి ఇంకా చూడాలి..!
GovernmentPolitical

బియ్యం దొంగలు-2

  •  సర్కిల్‌-1 ఎండీయూ సిబ్బంది చేతుల్లో వేల టన్నుల బియ్యం మాయం..
  • వీఆర్‌వోల సమక్షంలో లావాదేవీలను చర్చించుకుంటున్న గజ దొంగలు..
  • ఆర్‌ఐల అండదండలతో దారితప్పుతున్న నాణ్యమైన సర్కారు సన్న బియ్యం..
  • అల్లిపురం సమీప ప్రాంతాల్లో వేల టన్నుల సరుకుని మిల్లులకు తరలింపు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా అందింస్తున్న కోటా బియ్యం పేదలకు అందకుండానే ఆమడ దూరంలో ఉన్న మిల్లులకు రూ.కోట్ల రూపాయిలకు వెళ్లిపోతున్నాయి. ఉచితంగా ఇచ్చే బియ్యంతో ఉపయోగం లేదని పేదలు రూ.10చొప్పున విక్రయాలు చేస్తున్న విషయం తెలిసి కూడా వారికి అవగాహన పరచకుండా సంబంధిత వీఆర్‌వోలు, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐలు అటుగా పట్టించుకోకపోవడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నెలవారీ మామ్మూళ్లుతో పాటుగా దాడులు చేయడానికి వస్తున్నామని డీలర్‌కి ముందస్తు సమాచారం అందించడంతో వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారని సంబంధిత ఉన్నతాధికారులే పలుమార్లు హెచ్చిరించినట్టు సమాచారం. విశాఖ అర్బన్‌ జిల్లాలో గల అన్ని సర్కిల్స్‌ కంటే సర్కిల్‌-1లో అధిక మొత్తంలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. సంబంధిత సర్కిల్‌ పరిధిలో ఉన్న జిల్లా పౌరసరఫరాల శాఖ సిబ్బందితో డీలర్లకు, ఎండీయూ (మొబైల్‌ పంపిణీ యూనిట్‌)ల సిబ్బందికి పరిచయాలు అధికంగా ఉండటంతో ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా మారి జోరుగా అక్రమ విక్రయాలు చేస్తున్నారని పలువురు దొంగ వ్యాపారులే అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైన జిల్లా యంత్రాంగంలో పెద్ద అధికారులు పట్టించుకుంటారో లేదా వేచి చూడాలి.

  •  కోటా బియ్యానికి కొత్త కొత్త రూపాలు వస్తున్నాయి..!
    పేదలకు అందించే కోటా బియ్యం కొత్త కొత్త రూపాల్లో పక్కదారి పట్టి రూ.కోట్ల రూపాయిలుగా మార్పు చెందడం విశాఖలో స్పష్టంగా గమనించవచ్చు. ఎండీయూల ద్వారా కొనుగోలు జరిగిన బియ్యం పక్కదారి పట్టడానికి చౌకధర దుకాణాల్లోనే కొత్త రూపంలో మార్పు చెందడం జరుగుతుంది. ఓ వ్యాపారి నలుపు రంగు సంచుల్లో బియ్యాన్ని తరలిస్తుంటే.. మరో వ్యాపారి పండ్ల బాస్కెట్‌లో తరలిస్తున్నారు. ఓ వ్యాపారి ద్విచక్ర వాహనంపై రెండేసి బస్తాల చొప్పున తరలిస్తుంటే.. మరో వ్యాపారి దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రకం బియ్యం బ్రాండ్‌ పేరుతో ఒకే రకమైన బియ్యం సంచులను ముద్రించి అందులో రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి అధిక ధర కలిగిన బియ్యం బస్తాల రూపంలో దర్జాగా పక్కదారి పట్టిస్తున్నాడంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బియ్యం దొంగలు నెలలో మొదటి 10రోజులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేల టన్నుల కోటా బియ్యాన్ని ఆమడ దూరంలో ఉన్న రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు.

 

  •  అందరికీ తెలిసే అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి..!
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించాల్సిన కోటా బియ్యాన్ని డీలర్లు తింటున్నారని, ఇక నుంచి నేరుగా పేదల ఇంటికే బియ్యం చేరాలని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం పక్కదారి పట్టింది. మొబైల్‌ పంపిణీ యూనిట్‌ (ఎండీయూ)ల ద్వారా బియ్యం పేదలకు చేరుతాయని ప్రభుత్వం వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. డీలర్ల కంటే రెండిరతలు అధిక మొత్తంలో ఈ ఎండీయూలు కోటా బియ్యం కొనుగోలు చేసి డీలర్ల సహకారంతో అధిక మొత్తానికి విక్రయిస్తున్న ఘటనలు వందల సంఖ్యలో ఆధారాలతో పాటుగా పట్టుబడిన సంబంధిత జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థలో లోపాలు ఉంటే ఆ పక్కనే ఉన్న పోలీసు వ్యవస్థ దానికి అనుబంధంగా ఉండే టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థల్లో సైతం సిబ్బంది నెలవారీ వచ్చే మామ్మూళ్లుకు కక్కుర్తి పడి పేదల బియ్యం అక్రమ మార్గంలో పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రెండు నెలలు పరుగులు పెడతారు అంతే..!
    రేషన్‌ బియ్యం అక్రమ మార్గంలో విక్రయిస్తున్నామని అందరికీ తెలుసు..! మా వ్యాపారంలో వచ్చే రూపాయిలో అందరికీ సగం మొత్తం పంపిణీ చేస్తాం. అందుకోసమే జిల్లా అధికారి హెచ్చరికలు జారీ చేస్తే దిగువ స్థాయి అధికారులు రెండు నెలలు పరుగులు పెట్టి ఒకరిద్దరు అమాయకపు వ్యాపారులను బలి చేస్తారు. తరువాత ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటాం. పట్టుకోవడం ఓ నాటకం.. వదిలిపెట్టడం ఒక నాటకం.. ఎవ్వరైనా ఉన్నతాధికారి తమపై ఒత్తిడి చేస్తే ఆ నాటకానికి పెట్టే కొత్త పేరు ‘అక్రమ వ్యాపారి అరెస్ట్‌’ అని పేరు మార్చి కొత్త కథ రాస్తారు. అంతే కానీ మా వ్యాపారంలో ఇటువంటి అవినీతి అధికారులు ఉన్నంత వరకు ఎటువంటి డోకా లేదు. ఎప్పటిలాగే ఎండీయూ నుంచి డీలర్‌కి.. డీలర్‌ నుంచి దళారికి.. దళారి నుంచి మిల్లు వ్యాపారికి ప్రభుత్వ కోటా బియ్యం చేరుతునే ఉంటాయి. – ఓ వ్యాపారి (కోటా బియ్యం కొనుగోలు చేసే వ్యక్తి).
GovernmentPolitical

రూ.62.56లక్షలకే ఆశీల పాట..! పూర్ణామార్కెట్ లో రింగులాట..!

  •  సిబ్బంది సాయంతో రూ.కోట్ల సొమ్మును రూ.లక్షలకే కట్టుదిట్టం చేసిన రింగ్‌ మాస్టార్‌లు..
  •  స్టాండిరగ్‌ కమిటీకి తప్పుడు లెక్కలు చూపించి కైవసం చేసుకోవడానికి జోరు ప్రయత్నాలు..
  •  గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలు చెల్లించి ఒక్క రోజులో లక్షల సంపాధిస్తున్న డమ్మీ గుత్తేదారుడు..
  •  స్థానిక కార్పొరేటర్‌ బృందానికి రూ.11లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న రింగ్‌ మాస్టార్‌..
  •  పూర్ణామార్కెట్‌ ప్రధాన వర్తక సంఘానికి సైతం ముడుపులు చెల్లించడానికి గ్రీన్‌ సిగ్నెల్‌..
  •  చోటా నాయకుడితో పాటుగా ఓ విలేఖరికి రూ.లక్షల్లో సొమ్మును ఎరవేసిన మాస్టార్‌ మైండ్‌..
  •  అనుమతి పత్రాలు లేకుండానే ఆశీల కలెక్షన్‌ ప్రారంభించిన గుత్తేదారుల బృంద సభ్యులు..
  •  జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు..

 

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్‌ (సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్‌ మాస్టార్‌ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్‌ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్‌ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్‌ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.

 

 

  •  అంగీకారం తెలపకుండానే అనధికార వసూలకు పాల్పడుతున్న గుత్తేదారులు..
    ఈనెల 20న జీవీఎంసీకి సంబంధించిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని బహిరంగ వేలం వెయ్యగా.. సంబంధింత గుత్తేదారునికి జీవీఎంసీ జోన్‌-4 అధికారులు అంగీకర పత్రాలు ఇవ్వకుండానే అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా అటువంటి చేష్టలకు పాల్పడితే చట్టరిత్య చర్యలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడిరచారు. ఈ ప్రాంతంలో నిత్యం అధికంగా ఆశీలు వసూళ్లు, దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు సంబంధిత పోలీసులకు ఫిర్యాదులు అందించగా అది జీవీఎంసీ అధికారులు చూడాలని స్థానిక పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో గుత్తేదారుల అండ చూసుకొని అనధికారికంగా రహదారిపై వ్యాపారాలు చేస్తున్న కొందరు వ్యాపారులు వినియోగదారులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నా అటుగా పోలీసులు, జీవీఎంసీ అధికారులు స్పందించక పోవడం గుత్తేదారులకు ఇష్టానుసార అధికారాలు ఇవ్వడమేనని పలువురు ఆగ్రహిస్తున్నారు.

 

  • రింగు అవ్వడంతో గుత్తేదారుడికి రూ.17.50లక్షలు చెల్లింపులు అంచనా..?
    జీవీఎంసీకి చెందిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ బహిరంగ వేలం వెయ్యడం వలన జీవీఎంసీకి వచ్చే ఆదాయం కంటే పాటలో రింగుగా అయిన వ్యక్తికి సొమ్ము ఇవ్వడం, స్థానిక కార్పొరేటర్‌కి, అక్కడే ఉన్న చోటా మోటా నాయకులు, మార్కెట్‌ సంఘ నాయకులు, విలేకరులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని గుత్తేదారుడు మాటలు వింటే ఇట్టే అర్థం అయిపోతుంది. తనకు వచ్చే ఆదాయంలో సగ భాగం ఆమ్యామ్యాలు ఇవ్వడానికే సరిపోతుందని ఓ గుత్తేదారుడు వెల్లడిరచాడంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాదిలో వేలం పాట కైవసం చేసుకొని సుమారు 17లక్షల వరకు నష్టపోయిన ముగ్గురు వ్యక్తులకు (ముందుగా రింగు అయినందుకు) రూ.11లక్షలు, జీవీఎంసీ అధికార, సిబ్బందికి రూ.2.50లక్షలు, మార్కెట్‌ సంఘ సభ్యులకు రూ.1.50లక్షలు, ఓ విలేకరికి సుమారు రూ.2లక్షలు, స్థానిక చోటా మోటా నాయకుడికి రూ.50వేలు చొప్పున చెల్లించడానికి గుత్తేదారుడు ఒప్పందం సైతం చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో మరికొంత మంది హాజరవ్వడంతో కైవసం చేసుకున్న పాటను సైతం వదులు కోవడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని కూడా విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా జీవీఎంసీకి రూ.కోట్లలో రావల్సిన ఆదాయాన్ని గండికొట్టి రూ.లక్షల్లో తీసుకొస్తున్న ఘనత జీవీఎంసీ అధికారులకే చెల్లింది.

 

  •  అధిక ధరలు, అనధికార వస్సూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవ్‌..!
    జీవీఎంసీ బహిరంగ వేలం పాట నిర్వహించి రెండు రోజులు కూడా గడవక ముందే మార్కెట్‌ల్లో అనధికార వసూళ్లుకు పాల్పడటం, రహదారులపై ఎగుమతి దిగుమతులకు వాహనాలు చెల్లించే ఆశీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఇప్పటికే అక్కడ నియమించిన సంబంధిత సిబ్బందికి హెచ్చరించడం జరిగింది. గుత్తేదారులు కూడా అనుమతులు ఇవ్వకుండా వసూళ్లకు పాల్పడితే ముందుగా ఇచ్చిన డీడీలను రద్దు చేసి వేలం పాటను రద్దు చేయడం జరుగుతుంది. పైగా స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందించి చట్టరిత్య చర్యలు తీసుకుంటాం. జీవీంఎసీ ఆస్తుల్లో ఏ ఒక్కరైన చొరబడి వసూళ్లకు పాల్పడిన చట్టరిత్య చర్యలు తీసుకో బడతాయి. ఈ మధ్య వేసిన వేలం పాట స్టాండిరగ్‌ కమిటీకి పంపించాం. అక్కడ నుంచి అంగీకారం వస్తేనే గుత్తేదారులకు అనుమతి పత్రాలు ఇస్తాం. అంత వరకు వసూళ్లు చేయడానికి ఏ ఒక్కరికి ఎటువంటి అధికారం లేదు. అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే జోనల్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చెయ్యండి చర్యలు తీసుకుంటాం. కె.శివ ప్రసాద్‌ (జోనల్‌ కమిషనర్‌, జోన్‌-4 కార్యాలయం).
Political

క్యాంప్ రాజకీయాల్లో ఆ పార్టీ నెంబర్ వన్

– క్యాంపు రాజకీయాల్లో చంద్రబాబు దేశంలోనే నంబర్‌ వన్‌..

– ఎవ్వరు క్రాస్ ఓటు వేసారో మేము కనిపెట్టాము. సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకొంటాం..

– ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలి: సజ్జల రామకృష్ణ రెడ్డి..

నేత్ర న్యూస్, అమరావతి : ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడంపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు క్యాంపు రాజకీయలు, ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనైన వారు వారి భవిష్యత్‌ను గురించి ఆలోచించలేదని కౌంటింగ్‌ తర్వాత మీడియాతో మాట్లాడి సజ్జల పేర్కొన్నారు.

క్యాంప్ రాజకీయాలకు, ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్‌వన్‌ అని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ పై వైసీపీ సీనియర్‌ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. “ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిని గుర్తించాము. అయితే వారి పేర్లు ఇప్పుడు చెప్పము. సరైన సమయంలో వారిపై చర్యలుంటాయి,” అని సజ్జల వ్యాఖ్యానించారు.

గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినో కొనుగోలు చేసినట్లు ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

1 2
Page 1 of 2