Please assign a menu to the primary menu location under menu

Wednesday, November 29, 2023

NETRA NEWS

NETRA NEWS
49 posts
EntertainmentGovernmentSports

ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్

  • స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ విద్యార్థుల ప్రతిభకు అతిథుల నుంచి హర్షద్వానాలు..
  • రన్‌ ఫర్‌ ఫన్‌ పేరిట అంగ రంగ వైభవంగా జరిగిన బాలల దినోత్సవ వేడుక..
  • కార్యక్రమంలో అందరిని అలరించిన విద్యార్థుల నృత్య, సాహస ప్రదర్శనలు..
  • వేడుకను తిలకించేందకు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు..

నేత్ర న్యూస్, విశాఖపట్నం : బాలల దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని తలపించే విధంగా జరిగిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవోలు ఎం.సునిత, బి.పుష్య రాగం అన్నారు. మంగళవారం సాయంత్రం అక్కయ్యపాలెం, పోర్టు స్టేడియం, విశ్వనాథ్‌ కన్వెన్షన్స్‌లో స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన రన ఫర్‌ ఫన్‌ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథిలుగా పాల్గొని ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా గాజువాక ఎంఈవో ఎం.సునిత మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మానసిక ఉల్లాసంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో వారానికి రెండు రోజులు చిన్నారులకు క్రీడల వైపు మళ్ళించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాణిపేట ఎంఈవో బి.పుష్య రాగం మాట్లాడుతూ స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌లో వినూత్న రీతిలో చదివించడంతో పాటుగా క్రీడా పరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని అన్నారు. కరాటీ, డాన్స్‌, చెస్‌ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల అభ్యున్నతికి పునాదులు వేస్తున్న పాఠశాలగా వండర్‌ కిడ్స్‌ నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్‌ మళ్ల రామునాయుడు మాట్లాడుతూ బాలల దినోత్సవం అనేది బాలలు ఇష్టపడే విధంగా ఉండాలని, వాళ్ళ ఇష్టానుగుణంగా ఈ రన్‌ ఫర్‌ ఫన్‌ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ‘సరదా కోసం పరుగు’ పేరిట కార్యక్రమం నిర్వహించడం వలన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అనంతరం చిన్నారులకు పలు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటుగా పతకాలను అందించారు. కార్యక్రమంలో భాగంగా కేజీ విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు కరాటీ క్రీడలో చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరు ముఖ్య అతిథులు ఎంఈవోలు బి.పైడపునాయుడు, బి.విశ్వనాథం చిన్నారుల ప్రతిభకు మంత్రముగ్ధులై అభినందనల వెల్లువలు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా మెంటర్‌ ఎ.కృష్ణారెడ్డి, కోశాధికారి ఎంవీ రావు, విశాఖ జిల్లా అపుస్మా అధ్యక్షులు ఎస్‌.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్‌ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Devotional

ఆయన భక్తి అదో రకం

నేత్ర న్యూస్‌, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..

ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.

  • మా స్వామివారి భక్తిలో డిస్కౌంట్‌ ఆఫర్లు..
    దైవ భక్తితో చేసిన చేష్టలు చూడటానికి చక్కగా ఉంటే.. దొంగ భక్తితో చేసిన చేష్టలు చికాకు తెస్తున్నాయని ఆలయంలో సిబ్బంది కార్యనిర్వహణాధికారి ఆజాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యి మందికి మాలధారణ చేయమని చెప్పడం ఓ మాదిరిగా ఉన్నా.. ఇంట్లో కుదరలేని సిబ్బంది స్వామివారి మాల వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ధరించి విధులు నిర్వహించాలని నిబంధన పెట్టడంపై పలువురు సిబ్బంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మెడలో మాల లేకపోయినా వస్త్రాలు ధరించి విధులు నిర్వహించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆఖరికి చేసేదేమి లేక పై స్థాయి అధికారి చెప్పినట్టు నడుచుకోవడం మంచిదని సర్ధుకున్నారని సమాచారం. దీనిపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు, స్వామివారి భక్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • ఉన్నత స్థాయి అధికారికి ఉడతా భక్తి ఉందా..?
    అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈవో చంద్ర శేఖర్‌ ఆజాద్‌కి ఉడత చేసినంత భక్తి ఉందా..? లేదా నటిస్తున్నారా..? అనే సందేహాలు వెంటాడుతునే ఉన్నాయి. గతంలో శ్రీశైలం ఆలయంలో ఈవోగా ఉన్న సమయంలో గుప్త నిధుల వేటతో అక్కడి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన శివమాల పేరిట అక్కడ సిబ్బందిని హింసకు గురిచేయడం, ఆ తరువాత విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి మాలలు వేయాలని అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెట్టిన కొన్ని రోజులకే ఏసీబీ దాడుల్లో దొరికిపోవడం ఆయనకు నిజమైన భక్తి ఉందా..? లేదా భక్తి ఉన్నట్టు నటిస్తున్నారా..? అనే విషయం అర్థం కావడం లేదు. ఇదే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తన భక్తిని చాటుకునే క్రమంలో ఆయనతో పాటుగా సిబ్బంది మొత్తం మాలధారణ చేయాలని నిబంధనలు పెట్టడం, మాల వేయలేనివారు వస్త్రాలు ధరించి విధులు నిర్వహించాలని షరతులు పెట్టడం వెనుక పలు సందేహాలు వేధిస్తునే ఉన్నాయని తన తోటి ఉద్యోగులే గుస గుసలాడుకుంటున్నారు. ఇటువంటి వారిని చూసిన తరువాత ఏదిఏమైనా.. ఎవరూ ఏం చేసినా.. హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని నేత్ర న్యూస్‌ గుర్తుచేస్తుంది.

Crime

నగర వ్యాప్తంగా ‘స్పా’ లపై పోలీసుల దాడులు

  •  స్పా ముసుగులో చేసే గలీజ్‌ దందాపై కొరడా ఝళిపించిన సీపీ రవి శంకర్‌..
  •  ఏక కాలంలో అన్ని స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తున్న పోలీసు బృందాలు..
  •  వందల మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక తనిఖీలకు ఆదేశించిన నగర సీపీ..
  •  ప్రత్యేక విభాగాలతో పాటుగా స్థానిక స్టేషన్‌ సిబ్బంది సైతం దాడులకు హాజరు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్‌లపై పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభించిన దాడులు ఉరుకులు పరుగుల నడుమ జరుగుతునే ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏజీడీ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ నాటి నుండే తనదైన శైలిలో విధులు నిర్వహించడం ప్రారంభించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాలి. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన విభాగంలో ప్రత్యేక నిఘా కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేసిన విషయం మరిచిపోక ముందే రెండు రోజుల క్రితం నగరంలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేసిన తీరుతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో తన సిబ్బందితో పాటుగా నగరంలో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆయన ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసుకున్న టాస్క్‌ని సిబ్బందికి ఇచ్చారు. నగరంలో చట్ట విరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలను గుర్తించి దాడులకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా గల బ్యూటీ స్పాలు, మసాజ్‌ సెంటర్‌లపై ఏక కాలంలో దాడులు నిర్వహించడానికి పదుల సంఖ్యలో బృందాలను సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. స్పెషల్‌ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌, ఇంటెలిజెన్సీ విభాగ సిబ్బందితో పాటుగా స్థానిక స్టేషన్‌ స్థాయి నేర విభాగ, శాంతిభద్రతల సిబ్బందిని సైతం కలుపుతూ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెంటర్‌లపై దాడులు నిర్వహించిన సిబ్బంది కీలక ఆధారాలు సైతం స్వీకరించడంతో పాటుగా పలువురు వ్యభిచార ముఠాలను, విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు బాగోట..

  • నగర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి..
    స్పా సెంటర్‌లలో జరుగుతున్న కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ తనదైన శైలిలో దాడులకు ఆదేశాలు ఇచ్చారు. తన సిబ్బందికే ముందస్తు సమాచారం లేకుండా ఏక కాలంలో అందరికీ సమాచారం అందించి బృందాలను సిద్ధం చేశారు. సీఐలు, ఎస్సైలతో కూడిన బృందాలు ఒకేసారి దాడుల్లో పాల్గొనే విధంగా పథకం వేశారు. ఆదివారం.. పైగా రాత్రి సమయం.. కావడంతో చాలా మంది అసాంఫీుక కార్యకలాపాల్లో పాల్గొని పట్టుబడతారనే నెపంతో రాత్రి 7గంటల సమయంలో దాడులు ప్రారంభించారు. ఈ తరహాలో ఒకేసారి నగర వ్యాప్తంగా స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి. దాడులపై పూర్తి వివరాలు ఉన్నతాధికారులు త్వరలో వెల్లడిరచనున్నారు.
CrimeGovernment

బియ్యం దొంగలు

  •  పెద్ద మొత్తంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఎండీయూ సిబ్బంది..
  •  బియ్యం పంపిణీలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరికలు సైతం బేఖాతరు..
  •  కోటా బియ్యం విక్రయాల్లో చేతులు మారుతున్న రూ.కోట్ల సొమ్ము..
  •  ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తున్న పౌర సరఫరా శాఖ సిబ్బంది..
  •  కాసుల కక్కుర్తిలో పర్యవేక్షణను గాలికొదిలిన రెవెన్యూ యంత్రాంగం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్‌ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్‌ పంపిణీ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్‌ పంపిణీ యూనిట్‌ సిబ్బంది డీలర్‌ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్‌ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.

  •  దసరా మామ్మూళ్లు పేరిట రూ.లక్షల్లో సొమ్మును కాజేశారు..
    తాత్కలిక పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏడాదికి ఓమారు దసరా మామ్మూళ్లు వసూలు చేస్తే ఓమాదిరి వినడానికి వినసొంపుగా ఉంటే.. వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సిన ఎండీయూలు వారికి పైన ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌ఐలు, డీటీలు, పౌరసరఫరా శాఖ సిబ్బంది పేరిట రూ.లక్షల్లోనే వసూలు జరిగింది. వాహనం వద్దకు వచ్చి బియ్యం తీసుకొని, రూ.10 చొప్పున తీసుకొని విక్రయించే ప్రతీ ఒక్కరి వద్ద రూ.20చొప్పున సుమారు 5లక్షల కార్డులకు ఎంత మొత్తంలో వసూలు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం నుంచి జీతం, డీలర్‌ నుంచి కమీషన్‌, ప్రజల నుంచి మామ్మూళ్లు ఇలా నలు రకాలుగా వసూళ్లకు పాల్పడి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారని ప్రతి పక్షపార్టీ నాయకులు సైతం బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జేసీ డీలర్‌లు, ఆర్‌ఐలతో ఓ సమావేశమై చర్చించగా ఒకరిపై ఒకరు చెప్పుకొని సంఘ నాయకులపై నెట్టడంతో తర్జన భర్జనల నడుమ సమస్య సద్దుమనిగిందనే చెప్పాలి. కానీ ఈ వ్యవహారంపై నేటికీ విచారణ కొనసాగుతుందని సమాచారం.

 

  • పేదల బువ్వకు ఉపయోగించే బియ్యం కేజీ రూ.10 మాత్రమే..?
    ప్రభుత్వం అధిక మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తుంటే.. ఉచిత బియ్యంపై కేజీకి రూ.10 వస్తుందని ఎండీయూ సిబ్బందికే వదిలిపెడుతున్న ప్రజల చేష్టలను బియ్యం దొంగలు చిల్లర చేసుకుంటున్నారు. టన్నుల చొప్పున వాహనాల్లో అక్రమ రవాణా చేసి రూ.కోట్లల్లో విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరా శాఖతో పాటుగా ప్రత్యేక నిఘా బృందాలతో విధులు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగానికి సైతం బహిరంగ రహస్యంగానే తెలుసు. నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఈ వ్యవహారం చూసి చూడనట్టు ఉండటం వలన ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం పేదోడి కంచంలో బువ్వగా మారకుండానే మిల్లులకు ప్రయాణమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నా ఆయన కంటికి కనిపించకుండా జోరు వ్యాపారాలు సాగేందుకు సంబంధిత విభాగ సిబ్బందే పరోక్షంగా పనిచేస్తున్నారని వినికిడి.

  •  పర్యావేక్షణ లోపంతో పక్కదారి పడుతున్న కోటా బియ్యం..
    కోటా బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరా శాఖ అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు విభాగాలకు పూర్తి అధికారాలు ఉన్నా టన్నులు, టన్నులు బియ్యం పక్కదారి పట్టడం వెనుక అసలు రహస్యం అమ్యామ్యాలు మత్తులో కనిపించడం లేదనే చెప్పాలి. నెలవారీ వచ్చే మామ్మూళ్లుతో పాటుగా దాడులు నిర్వహించిన ప్రతీసారి పచ్చనోట్లు రావడంతో పర్యావేక్షణ పూర్తీగా లోపించిందనే పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇంటి దొంగలపై కొరడా ఝుళిపిస్తే ప్రయోజనం ఉంటుందని సంబంధిత విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది రహస్య అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
CrimeGovernment

పక్కదారి పట్టిన ప్లాస్టిక్‌ రహిత బృందాలు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్‌ కంటే తక్కువగా మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్‌ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్‌ జీవీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్‌కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్‌కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్‌కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్‌లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.

దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్‌లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారమా..?
    నెలకు రూ.5వేలు గౌరవ వేతనంతో వార్డు ప్రజలకు సేవలంధించే వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారం ఇవ్వడం వ్యాపారుల నుంచి విమర్శల గుప్పుమంటున్నాయి. వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించడంతో పాటుగా ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాల్లో సభ్యులుగా స్థానం కల్పించడంతో వాలంటీర్‌లు పెచ్చురేగిపోతున్నారు. గన్‌మాన్‌ల మాదిరి సఫారీ దుస్తులు ధరించి దాడులు చేయడానికి వెళ్లే క్రమంలో వాళ్లు ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా తయారైయిందని పలువురు వ్యాపారులు ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్‌కి స్పందనలో ఫిర్యాదులు సైతం ఇచ్చారు. రూ.15వేలు గౌరవ వేతనంతో పాటుగా చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద చిరు వ్యాపారులను బెధిరింపులకు గురిచేస్తూ దండీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వాలంటీర్‌ గురువారం ఉదయం విధులకు హాజరవ్వడానికి తన ఇంటి నుంచి వెళ్లే క్రమంలో పాతనగరంలో ఓ దుకాణంలోకి చొరబడి తాను జీవీఎంసీ టాస్క్‌ఫోర్స్‌ టీంగా పరిచయం చేసుకున్నాడు. తన బృందంతో వస్తే భారీగా జరిమానా విధిస్తానని, ఒక్కడిగా రావడంతో మీకు అదృష్టం అనుకోవాలని చెప్పారు. వెంటనే ఇవ్వనవసరం లేదని, సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి చల్లగా జారుకోవడమే కాకుండా దుకాణ యజమాని ఫోన్‌ నెంబర్‌ సైతం తీసుకొని బేర సారాలు ఆడటం మొదలపెట్టారు. దుకాణ యజమాని పనిపై బయట ఊరు వెళ్తానని చెప్పగా ఊరు వెళ్లడం వాయిదా వేసుకోవాలని, సాయత్రం వచ్చి మాట్లాడుతానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

  • ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాలు పని ఏంటీ..?
    విశాఖ పాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు గతనెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు ఖర్చు చేసి 10వాహనాలను ప్రారంభించారు. ఎనిమిది జోన్‌లకు 8వాహనాలను కేటాయించి రెండు వాహనాలను రిజర్వుగా ఆర్‌ఎఫ్‌వో కార్యాలయం వద్ద ఉంచారు. దీనికి గాను జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపకాధికారి కో`ఆర్డీనేటర్‌గా వ్యవరిస్తారు. 36మంది వాలంటీర్‌లను ఈ విభాగంలో ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని ఎంపిక చేశారు. అందులో ఒక వాలంటీర్‌ టీం లీడర్‌గా వ్యవరించి మరో 35మంది సభ్యులు నలుగురు చొప్పున ఎనిమిది వాహనాల్లో తమకు కేటాయించిన జోన్‌ పరిధిలో తిరుగుతూ ప్లాస్టిక్‌ కవర్లు, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులు వలన కలిగే ప్రమాదాలను వివరిస్తూ అవగాహన పరచాలి. అవగాహన కల్పించిన వ్యాపారస్తుడు మరోమారు స్పందించకపోతే అక్కడ లభ్యమయ్యే ప్లాస్టిక్‌ కవర్ల సామర్థ్యాన్ని బట్టి జరిమానాలు విధించాలి. అదీ కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో రశీదు పొందుతూ నగదు చెల్లించాలి. ఈ బృందాలకు వాలంటీర్‌గా నెలవారీ వచ్చే రూ.5వేలతో పాటుగా ఈ బృందంలో పనిచేస్తున్నందుకు మరో రూ.10వేలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. పైగా ఈ బృందాలు రోజువారీ తిరగడానికి ఒక్కొక్క వాహనానికి నెలకు 140 లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు రూ.1,37,620 ఖర్చు చేస్తున్నారు. ఈ బృందాలకు రోజువారీ సూచనలు, సలహాలు, శిక్షణ ఇచ్చి వ్యాపారులతో సక్రమంగా నడుచుకునేందుకు అవసరమైన అంశాలతో పాటుగా పనితీరు, ప్రయాణించే ప్రదేశాలు, విధులు వంటి వాటిని జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి చూసుకుంటారు.

  • విధులకు దూరంగా విలాశాలకు దగ్గరగా..!
    పాస్టిక్‌ రహిత అమలు బృందాలుగా గుర్తింపు పొందిన బృందాలు విధులు నిర్వహించడంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. నలుగురు చొప్పున ఏసీ కారులో దర్జాగా బీచ్‌లు, పార్కుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. వీవీఐపీలకు కేటాయించే పోలీసు అధికారులకు ఎక్కడా కూడా తీసుపోయే విధంగా ఈ వేషధారణ ఉండటంతో దుకాణాల్లో ఒక్కసారిగా చొరబడి సినీఫక్కి తరహాలో చొరబడి చిరు వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. కనీస ఉద్యోగ భద్రత లేని వ్యవస్థకు అన్ని అధికారులు ఇస్తే..? అనే విధంగా ఈ బృందాలు నగర రహదారులపై చెలరేగిపోతున్నాయి.
  • అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం..!
    ఈ బృందాలు నియమించడంలో ప్రధాన ఉద్ధేశం విశాఖ అభివృద్ధి. ప్లాస్టిక్‌ రహిత నగరంగా ఉండాలని ఇంత ఖర్చు చేసి ఈ తరహాలో పనిచేస్తున్నాం. సిబ్బంది ఇప్పటి వరకు అవినీతికి పాల్పడినట్టు సమాచారం లేదు. విధులు నిర్వహించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తమకు ఫిర్యాదులు ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -యాగంటి హనుమంత్‌రావు (ప్రాంతీయ అగ్నిమాపక అధికారి, జీవీఎంసీ).

 

Government

అధికారుల అండతో చీకటి వ్యాపారం

  • పౌర సరఫరా శాఖ సమక్షంలో పీడీఎస్ గోల్.. మాల్..
  • రేషన్ బియ్యం అక్రమ విక్రయాల్లో చేదోడు వాదోడు..
  • చూసి చూడ నందుకు నెలవారీ మామ్మూళ్లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్‌ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్‌-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్‌-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్‌ రైస్‌ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.

 

  • ఉన్నతాధికారుల నిఘా నీరు కారిపోతుంది..
    సర్కిల్‌ పరిధిలో డిఫోలు, ఎండీయూల నుంచి పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పడుతుందని రోజువారీ వందల ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో దిగువ స్థాయిలో ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌లు దండీగా దండుకుంటున్నారని సమాచారం. నెల చివరిలో వచ్చే జీతాల కంటే నెలవారీ వచ్చే మామ్మూళ్లుపై మక్కువ పెంచుకొని విధులు నిర్వహించడంతో అక్రమ విక్రయాలపై దృష్టి కేంద్ర్రీకృతం చేయలేకపోతున్నారని బహిరంగ రహస్యం. రోజువారీ సమీక్షలు నిర్వహించి దండిరచాల్సిన ఉన్నతాధికారులు సైతం చోద్యం చూడటంతో నిఘా నీరు కారిపోతుంది.

 

  • పీడీఎస్‌ అక్రమ విక్రయాలతో దండీగా దుడ్లు..
    పేదల బియ్యాన్ని పేదవాడికి అందించకుండా మిల్లులకు అక్రమంగా తరలించడంలో పౌర సరఫరా శాఖ సిబ్బంది, వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ దాడుల పేరిట పీడీఎస్‌ వ్యాపారులు, డిఫో డీలర్లు, ఎండీయూల నుంచి అందినకాడికి దోచుకోవడంలో సిద్ధ హస్తులుగా నిలుస్తున్నారు. ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చే బియ్యం పేదవాడికి అందకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు తరలించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బంది దండీగా దుడ్లు సంపాధిస్తున్నారని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది.

 

  • నెలలో పదిరోజులు పండగ చేసుకుంటున్నారు..
    ప్రతీ నెలలో మొదటి పది రోజులు పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. గిడ్డంగుల నుంచి రేషన్‌ డిపోలకు తరలించిన బియ్యం డిపోల్లో కొత్త ప్యాకింగ్‌లతో సిద్ధమై దర్జాగా మిల్లులకు ప్రయాణమవుతున్నాయంటే వ్యవస్థలో లోపాలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు సైతం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని పలువురు పేద ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
Crime

పోలీస్ బాస్ ఆట ఆరంభం

  • నగరంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్‌లను విశాఖ రేంజ్‌ డీఐజీ వద్ద హాజరు కావాలని ఉత్తర్వులు..
  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మందిపై దృష్టి పెట్టిన నగర పోలీస్‌ కమిషనర్‌..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : లోక కల్యాణం కోసం మూడు లోకములను మూడు మూడడుగులుగా కొలిచి.. రాక్షస గుణం కలిగిన బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఘటన నాడు ఆ త్రివిక్రముడు (వామనుడు) చేస్తే.. విశాఖ నగరంలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేసి, రూ.లక్షలాది సొమ్మును కాజేస్తూ రాక్షసులుగా ప్రవర్తించిన ముగ్గురు సీఐలను ఈ త్రివిక్రముడు విశాఖ రేంజ్‌కి బదిలీ చేయడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. గతంలో డీసీపీగా విధులు నిర్వహించిన డాక్టర్‌ సీఎం త్రివిక్రమవర్మ నగరంలో అన్ని అంశాలను తనదైన శైలిలో తెలుసుకొని పోలీసు కమిషనర్‌గా అడుగు పెట్టిన నాటి నుంచే తన పని ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు సీఐలను రేంజ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడమే కాకుండా వాళ్ల స్థానాలను వెంటనే వదిలిపెట్టి రేంజ్‌ డీఐజీ వద్ద హాజరయ్యే విధంగా చూడాలని సంబంధిత సబ్‌ డివిజన్‌ స్థాయి ఏసీపీలకు ఆదేశాలు జారీ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. గత పోలీసు కమిషనర్‌ హయాంలో నగరంలోకి చొరబడి ఆర్థిక లావాదేవీల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సీఐలను ముప్పై రోజుల్లో గుర్తించి విధుల నుంచి తప్పించడం పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

  • సొత్తు మాయం.. నాకు కొంత కాయం..!
    ఓ స్టేషన్‌లో శాంతిభద్రత ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన అధికారిపై గతంలో పలుమార్లు అవినీతి నిరోధకశాఖ దాడులు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటనలతో పాటుగా పలు కేసుల్లో జైలు జీవితం సైతం అనుభవించిన ఆయన విజయనగరం జిల్లాలో వీఆర్‌ నుంచి నగరంలోకి పాత కమిషనర్‌ గొడుగు నీడలో చొరబడ్డారనే చెప్పాలి. ఆయన వచ్చిన వెంటనే తనదైన పద్దతిలో ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే స్టేషన్‌ కోరగా నగరంలో కీలక పోలీసు స్టేషన్‌కి సీఐగా నియమించడమే ఆలస్యం అక్కడే ఏళ్ల తరబడి పాతకుపోయిన మరో కీలక వ్యక్తిని సైతం ఢీకొట్టి తన ప్రతాపం చూపించారని పలువురు సిబ్బందే గుసగుసలాడుకున్నారు. నాటి నుంచి నేటి వరకు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా..? అన్నట్టు స్టేషన్‌ పరిధిలో ఏ చోరీ జరిగినా నేర విభాగపు సిబ్బంది కంటే శాంతిభద్రత సీఐ ఘటనా స్థలానికి చేరిపోయి రూ.లక్షల్లో లావాదేవీలు మాట్లాడటంపై పోలీసు వర్గాల్లోనే ఆయోమయానికి గురిచేసింది. తన కింద ‘సంతోష్‌’oగా ఉండే ఓ కానిస్టేబుల్‌ని జనరల్‌ గార్డ్‌గా ఉంచుకొని దొంగతనం కేసులన్నిటినీ లా అండ్‌ ఆర్డర్‌ కేసుగా నమోదు చేసి దొంగలను సంబంధిత కంపెనీ వ్యక్తులను ఒక చోట కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి బేరసారాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో రూ.లక్షలో విలువైన సొత్తు పోయిందని ఓ కెంపెనీ సిబ్బంది స్టేషన్‌కి ఫిర్యాదు అందిస్తే.. ఆ ఫిర్యాదుని నేర విభాగానికి వెళ్లకుండా శాంతిభత్రల విభాగంలోనే శాంతింపజేశారంటే గొప్ప విషయంగానే చెప్పాలి.

 

  • అయ్యో రూ.పది లక్షలు పోయే పోస్టింగ్‌ పోయే..!
    ఓ పోలీసు స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహించే ఇన్‌స్పెక్టర్‌ ఆవేదన వర్ణాతీతం. తన స్టేషన్‌ పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలను చూసి చూడనట్టు ఉండటానికి తన బాస్‌కి రూ.పది లక్షలు మూటను బహుమతిగా ఇచ్చిన ఆ సీఐ ఆశలు అంతలోనే ఆవిరైపోయాయని అంతా అనుకుంటున్నారు. స్టేషన్‌ పరిధిలో జరిగిన చిన్నా చితకా కేసుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేయాల్సిన కేసుల్లో సైతం భారీగానే వసూలు చేసి కొంత సొమ్మును స్టాక్‌ మార్కెట్‌లో పెట్టి మరి కొంత సొమ్మును అటుగా పట్టించుకోని పోలీసు బాస్‌కి ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న ఆ అధికారికి అంతా అడ్డంగా తిరిగిందనే చెప్పాలి. తీవ్ర ఆరోపణలతో కొత్త బాస్‌కి సమాచారం వెళ్లడంతో పాతాళంలో బలి చక్రవర్తి మాదిరి తొక్కి రేంజ్‌కి తరలించడంతో తోటి స్థాయి ఉద్యోగులతో పాటుగా దిగువ స్థాయి సిబ్బందిలో గుసగుసలు గుప్పుమంటున్నాయి.

 

  • పోలీసు కమిషనరేట్‌లో అంతా నా ఇష్టం..
    విశాఖ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఓ మూడు స్టార్‌ల ఉద్యోగి మొత్తాన్ని శాసిస్తున్నాడంటే ముందున్న పోలీసు బాస్‌ అతనికి ఎంతటి బాధ్యత అప్పగించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి. తానే సీపీగా, డీసీపీగా వ్యవహరించి చాలా అంశాల్లో కీలకంగా ఉన్నారని పలువురు సిబ్బంది వెల్లడిరచిన మాటల్లో క్లుప్తంగా అర్థం అయిపోతుంది. ఈ మధ్య కాలంలో షాడో సీపీగా గుర్తింపు పొందాడంటే ఇరువురి మధ్య జరిగిన వ్యవహారం ఎంత మొత్తంలో ఉంటుందో అని మూడు స్టార్‌ల ఉద్యోగి కంటే పైస్థాయి అధికారులే ముక్కున వేలు వేసుకున్నారంటే ఆయన కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చిన్న పోలీసు స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహించి లావాదేవీల్లో అధిక మొత్తాన్ని సంపాధించే నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో ఏకంగా బాస్‌కే జనరల్‌ గార్డ్‌గా ఉండి షాడో సీపీగా గుర్తింపు పొందిన ఈ అధికారికి కొత్త పోలీస్‌ బాస్‌ ఇచ్చిన డీవో నెంబర్‌ 279/2023 బహుమతి పాతాళంలోకి తొక్కిపెట్టిన ఇబ్బందులు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. నగరంలో గల అన్ని స్టేషన్‌ల లావాదేవీలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయని విశ్వసనీయ సమాచరం.

 

  • అవినీతి చేస్తే రేంజ్‌ కాయమా..?
    నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆ పైస్థాయి అధికారుల గుండెల్లో బుల్లెట్‌ రైళ్లు పరిగెడుతున్నాయి. సీపీగా డాక్టర్‌ సీఎం త్రివిక్రమ వర్మ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ఆలోచనల్లో పడిపోయిన అధికారులకు డీవో నెంబర్‌ 279/2023 చూసిన తరువాత బుల్లెట్‌ రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి. 30రోజుల్లో ముగ్గురు సీఐలను గుర్తించి రేంజ్‌ డీఐజీకి అప్పగించారంటే ముందు ముందు మరెంతమంది ఆ ఖాతా బుక్కుల్లో బుక్‌ అయిపోతారో అని భయాందోళనలో పడిపోయారు. ఇక దిగువ స్థాయి సిబ్బందికి అయితే ఇప్పటికే చెమటలు పట్టేసి ఉంటాయి.
Uncategorized

తునికలు కొలతల్లోనే లోపాలు..!

  • చిరు వ్యాపారుల నుంచి ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్న మెట్రాలజీ సిబ్బంది..
  •  జరిమానా రశీదుకు రెండిరతలు కాజేస్తున్న విశాఖ తూనికలు కొలతల శాఖ సిబ్బంది..
  •  ఏఎంసీ పేరిట నకిలీ సంస్థలతో చేతులు కలిపి ఒక్కొక్క దుకాణం నుంచి రూ.వేలల్లో డిమాండ్‌..
  •  ఓ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సైతం ఏఎంసీ సొమ్ము పేరిట రూ.వెయ్యి అదనంగా వసూళ్లు..
  •  జరిమానా చెల్లించలేదని కాటాలను వాహనంలో తీసుకుపోయిన లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది..
  • ప్రైవేటు సంస్థల నుంచి నెల మామ్మూళ్లు పేరిట రూ.లక్షల్లో దోచుకుంటున్న యంత్రాంగం..
  •  లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది చేష్టలను అటుగా పట్టించుకోని అవినీతి నిరోధక శాఖ..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : బయట ప్రపంచానికి కనిపించకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాల్లో ఒకటైన లీగల్‌ మెట్రాలజీ శాఖ (తూనికలు కొలతలు) విభాగం చేస్తున్న చేష్టలకు చిరు వ్యాపారులు బోరుమంటున్నారు. ఏడాదికి ఓమారు తనిఖీల పేరిట చిరు దుకాణాలు, తోపుడు బండ్లు వద్దకు వచ్చిన లీగల్‌ మెట్రాలజీ అధికార సిబ్బంది చేసే హడావుడితో వ్యాపారులు హడలెత్తిపోతున్నారనే చెప్పాలి. జీవోలో ముద్రించిన విధంగానే జరిమానాలు వసూళ్లు చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇచ్చిన రశీదు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న సొమ్మును ఏ లెక్కల్లో చూపిస్తారో వాళ్లకే తెలియాలి. పెద్ద పెద్ద మార్కెట్‌లు, షాపింగ్‌ మాల్స్‌, పెద్ద డిపార్టుమెంటెల్‌ స్టోర్స్‌ నుంచి ఏడాది ఓమారు అప్పనంగా వచ్చే మామ్మూళ్లు మత్తులో అటుగా తనిఖీలు చేయని లీగల్‌ మెట్రాలజీ విభాగ సిబ్బంది రహదారులపై కాయగూరలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులపై ఒక్కసారిగా పడి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం నుంచి ఏడాదికి ఓమారు దుకాణాల వద్దకు వచ్చి కాటాలకు వేసిన ముద్రణలతో కూడుకున్న సీల్స్‌ను మార్చాల్సిన సిబ్బంది అటుగా కనిపించకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు రాజ్యమేలుతున్నారని ఆరోపిస్తున్నారు. కేజీలకు అనువుగా ఒక్కొక్క కాటాకు ఓ మొత్తంలో తీసుకోవల్సిన ప్రైవేటు వ్యక్తులు సైతం అదనంగా రూ.2వేల నుంచి రూ.3వేలు డిమాండ్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని వెల్లడిస్తున్నారు. దీనిపై సంబంధిత ప్రైవేటు వ్యక్తులను వివరణ కోరగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటుగా ప్రభుత్వ అధికారులకు చెల్లిస్తున్న చిల్లర సొమ్ము కలుపుతూ అదనంగా వసూలు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. భారీ మొత్తంలో సొమ్మును చెల్లించలేమని బాధితులు బోరుమంటే సంబంధిత సిబ్బందిని దుకాణాల మీదకు ఎక్కించే ఘనమైన ఘనత కూడా వాళ్ల సొంతం. ఏడాదికి ఓసారి వచ్చి అడిగిన సొమ్మును చెల్లించకపోతే జరిమానా విధించి కాటాలను తీసుకెళ్లిపోతామని పలుమార్లు ప్రైవేటు వ్యక్తులే బెధిరింపులకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

  • భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది..
    వస్తు కొనుగోలు సమయంలో వ్యాపారుల నుంచి వినియోగదారులు మోసపోకుండా చూడాల్సిన యంత్రాంగమే మొదటిగా వ్యాపారులను తద్వారా వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు విశాఖ నగరంలో కోకొల్లలు. కాటాలకు సీల్స్‌ పేరిట ఏడాదికి ఓమారు దుకాణాలకు రావల్సిన సంబంధిత సిబ్బంది అటుగా కనిపించకుండా ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మొత్తానికి మరో ఏడిరతలు అదనంగా వసూలు చేస్తూన్నారని పలువురు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కాటాలకు అదనంగా సొమ్ము చెల్లించి సీల్స్‌ వేసిన సమయంలో కనిపించని అధికారులు కొత్త ఏడాదిలో కాటా సీల్స్‌ వెయ్యలేదని ఎలా మాటు వేసి వసూళ్లకు పాల్పడుతున్నారో బహిరంగ రహస్యంగానే పరిగణించాలి. సాధారణ వ్యాపారులను బెధిరింపులకు గురిచేసి అదనంగా సొమ్ము వసూలు చేయడం, చెల్లించని యడల కాటాలను బలవంతంగా తీసుకుపోవడం సాధారణ విషయంగా తయారైయిందని వ్యాపారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని సందర్భాల్లో జరిమానాలు విధించిన సిబ్బంది దుకాణంలో లభ్యమయ్యే వస్తువులను సైతం బెధిరించి తీసుకుపోతున్నారని ఓ వ్యాపారి బహిరంగంగానే వివరిస్తున్నారు.

  • ఏఎంసీ పేరిట తూనికలు, కొలతలు శాఖ సిబ్బంది నయా దందా..
    దుకాణాల్లో వస్తువులు తూనిక చేసే సమయంలో ఉపయోగించే కాటాల వ్యవహారంలో ఓ నయా దందానే నడుస్తుంది. కాటాలకు ఏడాదికి ఓమారు ఏఎంసీతో పాటుగా సీల్స్‌ వెయ్యాలని రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తూ చిరు వ్యాపారుల నుంచి దోచుకుంటున్న లీగల్‌ మెట్రాలజీ విభాగ అధికారులు ఓ కొత్త దందాకు నాంది పలికారు. తమ విభాగ సంరక్షణలో ఉన్న కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఏడాదికి సీల్స్‌తో పాటుగా ఏఎంసీ (ఎన్యువల్‌ మెయింటెనెన్స్‌ ఛార్జ్‌) పేరిట రూ.వేలల్లో వసూలు చేయమని పంపిస్తున్నారు. ఆ సమయంలో సంబంధిత దుకాణదారుడు అంత మొత్తంలో సొమ్ములు చెల్లించలేమని చేతులెత్తేస్తే సంబంధిత షాడో సిబ్బంది లీగల్‌ మెట్రాలజీ విభాగ అధికారులకు సమాచారం అందించి ఆ దుకాణంపై దాడులు జరుపుతున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిరు వ్యాపారులు జరిమానాలు చెల్లించి బోరుమంటున్నారు. రూ.2వేల నుంచి రూ.3వేల సొమ్ములో ప్రభుత్వానికి రెండు వందలు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టు రశీదు ఇవ్వడం ఓ సరికొత్త దందా చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. షాడోలు చేసిన దందాతో వ్యాపారులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామని ఆరోపిస్తుంటే ఇప్పుడు నేరుగా సంబంధిత విభాగ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులే దుకాణాల వద్దకు వచ్చి రూ.వెయ్యి జరిమానా, అదనంగా మరో రూ.వెయ్యి తీసుకొని ఏఎంసీ అని సీల్స్‌ వెయ్యకుండానే రుసుం వసూలు చేశారు. పైగా నాలుగు రోజుల్లో సీల్స్‌ వెయ్యడానికి వచ్చే వక్తులకు మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పి తప్పించుకున్నారు.
GovernmentPolitical

రూ.62.56లక్షలకే ఆశీల పాట..! పూర్ణామార్కెట్ లో రింగులాట..!

  •  సిబ్బంది సాయంతో రూ.కోట్ల సొమ్మును రూ.లక్షలకే కట్టుదిట్టం చేసిన రింగ్‌ మాస్టార్‌లు..
  •  స్టాండిరగ్‌ కమిటీకి తప్పుడు లెక్కలు చూపించి కైవసం చేసుకోవడానికి జోరు ప్రయత్నాలు..
  •  గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలు చెల్లించి ఒక్క రోజులో లక్షల సంపాధిస్తున్న డమ్మీ గుత్తేదారుడు..
  •  స్థానిక కార్పొరేటర్‌ బృందానికి రూ.11లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న రింగ్‌ మాస్టార్‌..
  •  పూర్ణామార్కెట్‌ ప్రధాన వర్తక సంఘానికి సైతం ముడుపులు చెల్లించడానికి గ్రీన్‌ సిగ్నెల్‌..
  •  చోటా నాయకుడితో పాటుగా ఓ విలేఖరికి రూ.లక్షల్లో సొమ్మును ఎరవేసిన మాస్టార్‌ మైండ్‌..
  •  అనుమతి పత్రాలు లేకుండానే ఆశీల కలెక్షన్‌ ప్రారంభించిన గుత్తేదారుల బృంద సభ్యులు..
  •  జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు..

 

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్‌ (సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్‌ మాస్టార్‌ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్‌ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్‌ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్‌ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.

 

 

  •  అంగీకారం తెలపకుండానే అనధికార వసూలకు పాల్పడుతున్న గుత్తేదారులు..
    ఈనెల 20న జీవీఎంసీకి సంబంధించిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని బహిరంగ వేలం వెయ్యగా.. సంబంధింత గుత్తేదారునికి జీవీఎంసీ జోన్‌-4 అధికారులు అంగీకర పత్రాలు ఇవ్వకుండానే అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా అటువంటి చేష్టలకు పాల్పడితే చట్టరిత్య చర్యలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడిరచారు. ఈ ప్రాంతంలో నిత్యం అధికంగా ఆశీలు వసూళ్లు, దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు సంబంధిత పోలీసులకు ఫిర్యాదులు అందించగా అది జీవీఎంసీ అధికారులు చూడాలని స్థానిక పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో గుత్తేదారుల అండ చూసుకొని అనధికారికంగా రహదారిపై వ్యాపారాలు చేస్తున్న కొందరు వ్యాపారులు వినియోగదారులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నా అటుగా పోలీసులు, జీవీఎంసీ అధికారులు స్పందించక పోవడం గుత్తేదారులకు ఇష్టానుసార అధికారాలు ఇవ్వడమేనని పలువురు ఆగ్రహిస్తున్నారు.

 

  • రింగు అవ్వడంతో గుత్తేదారుడికి రూ.17.50లక్షలు చెల్లింపులు అంచనా..?
    జీవీఎంసీకి చెందిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ బహిరంగ వేలం వెయ్యడం వలన జీవీఎంసీకి వచ్చే ఆదాయం కంటే పాటలో రింగుగా అయిన వ్యక్తికి సొమ్ము ఇవ్వడం, స్థానిక కార్పొరేటర్‌కి, అక్కడే ఉన్న చోటా మోటా నాయకులు, మార్కెట్‌ సంఘ నాయకులు, విలేకరులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని గుత్తేదారుడు మాటలు వింటే ఇట్టే అర్థం అయిపోతుంది. తనకు వచ్చే ఆదాయంలో సగ భాగం ఆమ్యామ్యాలు ఇవ్వడానికే సరిపోతుందని ఓ గుత్తేదారుడు వెల్లడిరచాడంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాదిలో వేలం పాట కైవసం చేసుకొని సుమారు 17లక్షల వరకు నష్టపోయిన ముగ్గురు వ్యక్తులకు (ముందుగా రింగు అయినందుకు) రూ.11లక్షలు, జీవీఎంసీ అధికార, సిబ్బందికి రూ.2.50లక్షలు, మార్కెట్‌ సంఘ సభ్యులకు రూ.1.50లక్షలు, ఓ విలేకరికి సుమారు రూ.2లక్షలు, స్థానిక చోటా మోటా నాయకుడికి రూ.50వేలు చొప్పున చెల్లించడానికి గుత్తేదారుడు ఒప్పందం సైతం చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో మరికొంత మంది హాజరవ్వడంతో కైవసం చేసుకున్న పాటను సైతం వదులు కోవడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని కూడా విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా జీవీఎంసీకి రూ.కోట్లలో రావల్సిన ఆదాయాన్ని గండికొట్టి రూ.లక్షల్లో తీసుకొస్తున్న ఘనత జీవీఎంసీ అధికారులకే చెల్లింది.

 

  •  అధిక ధరలు, అనధికార వస్సూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవ్‌..!
    జీవీఎంసీ బహిరంగ వేలం పాట నిర్వహించి రెండు రోజులు కూడా గడవక ముందే మార్కెట్‌ల్లో అనధికార వసూళ్లుకు పాల్పడటం, రహదారులపై ఎగుమతి దిగుమతులకు వాహనాలు చెల్లించే ఆశీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఇప్పటికే అక్కడ నియమించిన సంబంధిత సిబ్బందికి హెచ్చరించడం జరిగింది. గుత్తేదారులు కూడా అనుమతులు ఇవ్వకుండా వసూళ్లకు పాల్పడితే ముందుగా ఇచ్చిన డీడీలను రద్దు చేసి వేలం పాటను రద్దు చేయడం జరుగుతుంది. పైగా స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందించి చట్టరిత్య చర్యలు తీసుకుంటాం. జీవీంఎసీ ఆస్తుల్లో ఏ ఒక్కరైన చొరబడి వసూళ్లకు పాల్పడిన చట్టరిత్య చర్యలు తీసుకో బడతాయి. ఈ మధ్య వేసిన వేలం పాట స్టాండిరగ్‌ కమిటీకి పంపించాం. అక్కడ నుంచి అంగీకారం వస్తేనే గుత్తేదారులకు అనుమతి పత్రాలు ఇస్తాం. అంత వరకు వసూళ్లు చేయడానికి ఏ ఒక్కరికి ఎటువంటి అధికారం లేదు. అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే జోనల్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చెయ్యండి చర్యలు తీసుకుంటాం. కె.శివ ప్రసాద్‌ (జోనల్‌ కమిషనర్‌, జోన్‌-4 కార్యాలయం).
Government

అభివృద్ధి పనులు పరిశీలించిన ఆదిమూలపు

నేత్ర న్యూస్, విశాఖపట్నం : ఈ నెల 28, 29 తేదీలలో జరుగనున్న జి-20 సదస్సు కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి విశాఖ నగరానికి విచ్చేస్తున్న ప్రతినిధులను, అతిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, అధికారులు తో కలిసి మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పర్యటించి పరిశీలించారు. దీనిలో భాగంగా మాధవధారలో ఉన్న పంప్ హౌస్ కు చేరుకొని దీని ద్వారా 24/7 నీటి సరఫరా ఆ ప్రాంత ప్రజలకు నిరాటంకంగా అందించడం జరుగుతుందని, నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయాలు లేకుండా వున్నాయని, ఎలక్ట్రికల్ సిస్టం ద్వారా లైన్ లోకి వెళ్లకుండానే తాగునీరు ఆపే విధానం తోపాటు ఎక్కడైనా లేఖలు ఉన్నట్లయితే త్రాగునీటి వృధా అవకుండా సిస్టం ద్వారా తెలుసుకొని అరికట్టవచ్చని ఈ పంప్ హౌస్ ఎ.డి.బి. నిధులతో ఏర్పాటు చేయడమైనదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ కు తెలిపారు. అనంతరం మూఢసరలోవ రిజర్వేయర్ లో ఉన్న సోలార్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసి, విద్యుత్ ను ఆదా చేయడమే కాకుండా, కాలుష్యాన్ని నివారిస్తూ, ఆర్ధిక లాభం జివిఎంసి పొందుతుందన్నారు. 24 గంటలు ప్రజలకు మంచి నీటి సరఫారాను అందించడం జరుగుతుందన్నారు. వేస్ట్ వాటర్ ను రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మంచి నీటిని నగరంలో గల పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా జివిఎంసి కు ఆదాయం చేకూరుతుంది అని మంత్రి ఆదిమలకు సురేష్ కు అధికారులు వివరించారు. జి.20 సంబంధించి అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాన్ని టాప్ -10 సిటీలలో ఒక సిటీగా ఉండేటట్లు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలనే స్థాయికి విశాఖ నగరం ముస్తాబ్ అవుతుందని తెలిపారు.

అనంతరం సీత కొండ బీచ్ వద్ద వ్యూ పాయింట్ ను పరిశీలించారు ఈ వ్యూ పాయింట్ను డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా (సీతకొండ) దగ్గర అనే నామకరణం చేసేందుకు ప్రతిపాదనలను మంత్రి ఆదిమలకు సురేష్, గుడివాడ అమర్నాథ్ కు తెలియజేశారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్లు రొయ్యి వెంకటరమణ, కె స్వాతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 2 5
Page 1 of 5