NETRA NEWS > Government > హస్త కళలను ప్రోత్సహించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్
నేత్ర న్యూస్, విశాఖపట్నం : హస్తకళలను ప్రోత్సాహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. మదురవాడలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజారు, కళాత్మక చేనేత వస్త్రముల ప్రదర్శన, అమ్మకాలను ఆయనతో పాటు ఆయన సతీమణి విశ్వాంజలి గైక్వాడ్ లు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. భారతదేశ కళలను సంరక్షించుటకు, కాపాడుటకు, అభివృద్ధి పరచుటకు సరియైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వాటి ఉన్నతికి హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకు వారిని ప్రోత్సహించాలన్నారు. హస్త కళలను ప్రోత్సహిస్తూ వారి శ్రేయస్సు కొరకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోగల వివిధ రాష్ట్రముల నుండి జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అనేక మంది చేతివృత్తి కళాకారులు తాము తయారుచేసిన వివిధ కళాఖండములను ఒకే వేదిక వద్దకు తీసుకువచ్చి పొందిన చేతితో తయారుచేయబడిన కళాఖండములను ప్రేమించి విశాఖ నగర పౌరులకు కళాకారులే తమ వస్తువులను నేరుగా అమ్ముకొను సౌకర్యమును కల్పించుటయే ఈ గాంధీ శిల్ప బజారు యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొను కళాకారులు కొనుగోలు దారుల అభిరుచికి తగ్గ ప్రసిద్ధ డిజైన్లను ప్రస్తుత వ్యాపారానికి తగినట్లుగా తయారుచేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనలో సుమారు 100 నుండి 125 మందికి పైగా వివిధ రకాల చేతివృత్తుల కళాకారులు తమ వస్తువులను ప్రదర్శన, అమ్మకమునకు ఉంచబడినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి కలంకారి ప్రింటింగ్, పెయింటింగులు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లేసు అల్లికలు, చెక్కతో తయారు కాబడిన వివిధ రకాల కళాకృతులు, టెర్రకోట పాటరీలు, తాటియాకులతో తయారు కాబడిన వస్తువులు, ఏలూరు తివాచీలు, కేన్ వస్తువులు, మంగళగిరి డ్రస్ మెటీరియల్స్, చీరాల చీరలు, హైదరాబాదు ముత్యాలు, నిజామాబాద్ మెమెంటోలు, బ్లాక్ మెటల్ వస్తువులు, ఉదయగిరి ఉడెన్ కట్లరీ వస్తువులు, నిర్మల్ పెయింటింగ్లు, తదితరమైనవి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణములు, తివాచీలు, వివిధ ఆకృతుల లోహపు వస్తువులు, శిలలతో తయారుచేయబడిన కళాత్మక వస్తువులు, వివిధ రకాల ప్రింటింగ్ వస్త్రాలు, చిత్రపటాలు, సిల్వర్ ఫిలిగ్రీ, లడ్డు గాజులు, దోప్లేస్టింగ్లు, డ్రై ఫ్లవర్స్, కేన్ వస్తువులు, బాతిక్ పెయింటింగ్లు, ఉద్-ఇన్-లే వస్తువులు, తంజావూరు, మైసూరు పెయింటింగులు మొదలగునవి. ప్రదర్శన, అమ్మకమునకు ప్రరర్శించినట్లు చెప్పారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటలు నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయని, శెలవు దినములలో కూడా తెరచి ఉంటాయన్నారు. ఈ ప్రదర్శన హస్తకళల అభివృద్ధి కమిషనర్ కార్యాలయములు, జౌళిశాఖ, కేంద్రప్రభుత్వం, న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ) లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్, విశాఖపట్నం వారి సౌజన్యంతో నిర్వహించబడుచున్నదని తెలిపారు.
గాంధీ శిల్పబజూరు లేపాక్షి హస్తకళలు మరియు కళాత్మక చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకమునకు వివిధ రాష్ట్రముల నుండి వచ్చిన కళాకారులు తాము తయారుచేసిన వస్తువులను నేరుగా అమ్ముకొనుటకు విస్తృత ప్రచారం గావించి వారికి చేయూత నివ్వవలసినదిగా కోరారు. కార్యక్రమంలో ఎపి హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. విజయలక్ష్మి, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ మనోహర్, విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య, డిసి హెచ్ ఎడి అపర్ణ లక్ష్మి. యన్, హెచ్ పిఓ ఎం సువర్చల, లేపాక్షి మేనేజర్ కె. విజయ గౌరి, ఇన్ చార్జ్ మేనేజర్ బి. శైలజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NETRA NEWS
the authorNETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
బియ్యం దొంగలు
November 3, 2023
అధికారుల అండతో చీకటి వ్యాపారం
June 2, 2023
అభివృద్ధి పనులు పరిశీలించిన ఆదిమూలపు
March 25, 2023