NETRA NEWS > Entertainment > విశాఖలో సందడి చేసిన కథ వెనుక కథ చిత్ర బృందం
నేత్ర న్యూస్, విశాఖపట్నం: దండమూడి బాక్స్ఆఫీస్ పతాకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నూతనంగా నిర్మించిన కథ వెనుక కథ చిత్రం యూనిట్ విశాఖలో ఆదివారం సందడి చేసింది. నగరంలోనీ ఓ హోటల్లో ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ స్ తో చిట్ చాట్ చేశారు. అనంతరం చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ కథ వెనుక కథ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది అన్నారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించమన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగిందని గొట్టిపాటి సాయి పేర్కొన్నారు.
అనంతరం చిత్ర హీరో (ఓ పిట్టకథ ఫేమ్) విశ్వంత్ మాట్లాడుతూ తన కెరియర్లో ఈ చిత్రం ఒక మైలురాయిలుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని ఒక వినూత్నమైన పాత్రను పోషించానన్నారు. అనంతరం ప్రముఖ కమెడియన్ మధు నందన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాననిఅన్నారు. బాగా ఈ చిత్రంలో ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య ,హీరోయిన్లు శ్రీజిత ఘోష్, శుభశ్రీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 24న ప్రేక్షకులకు ముందుకి వస్తున్న తమను ఆదరించి, సినిమాను సక్సెస్ చేయాలని కోరారు.
Source:RAVI KUMAR
Via:NETRA NEWS
NETRA NEWS
the authorNETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు
March 19, 2023
ఘనంగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు
September 2, 2022
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!
July 29, 2022