నేత్ర న్యూస్, విశాఖపట్నం: దండమూడి బాక్స్ఆఫీస్ పతాకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నూతనంగా నిర్మించిన కథ వెనుక కథ చిత్రం యూనిట్ విశాఖలో ఆదివారం సందడి చేసింది. నగరంలోనీ ఓ హోటల్లో ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ స్ తో చిట్ చాట్ చేశారు. అనంతరం చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ కథ వెనుక కథ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది అన్నారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించమన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగిందని గొట్టిపాటి సాయి పేర్కొన్నారు.
అనంతరం చిత్ర హీరో (ఓ పిట్టకథ ఫేమ్) విశ్వంత్ మాట్లాడుతూ తన కెరియర్లో ఈ చిత్రం ఒక మైలురాయిలుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని ఒక వినూత్నమైన పాత్రను పోషించానన్నారు. అనంతరం ప్రముఖ కమెడియన్ మధు నందన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాననిఅన్నారు. బాగా ఈ చిత్రంలో ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య ,హీరోయిన్లు శ్రీజిత ఘోష్, శుభశ్రీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 24న ప్రేక్షకులకు ముందుకి వస్తున్న తమను ఆదరించి, సినిమాను సక్సెస్ చేయాలని కోరారు.