Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Wednesday, November 29, 2023
Government

జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శిల చేతివాటం

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం: జీవీఎంసీ జోన్‌-4లో పట్టణ ప్రణాళిక కార్యదర్శిలు చేతివాటం చూపిస్తూ చెలరేగిపోతున్నారు. తాము చేసిందే చట్టంగా వార్డు స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. గతంలో చైన్‌మాన్‌లు చేసిన అవినీతికి ఏ మాత్రం తగ్గకుండా జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ పరువుని నిలబెడుతున్నారు. ఇన్‌ఛార్జీ ఏసీపీ, టీపీవోగా వ్యవరిస్తున్న అధికారి, తన కింద టీపీఎస్‌ స్థాయి సిబ్బంది సైతం ఉన్నా ఇటుగా ఒక్కసారి కూడా తొంగి చూడలేదంటే భవన యజమానులు అక్కడికి ఎన్ని ముడుపులు పంపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుమతులు లేకుంటే విద్యుత్తు, మంచి నీరు వంటి సధుపాయాలు ఇవ్వడం కుదరదని జీవీఎంసీ కమిషనర్‌ ఇప్పటికే ప్రకంటించినా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగువ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు రూ.లక్షలకు కక్కుర్తి పడి భవన యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. 36వ వార్డులో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పరిస్థితిపై సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి విట్టల్‌ను ఆరా తియ్యగా.. కాకమ్మ కబుర్లు చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును తన ఖాతాలో వేసుకొని ఆ వార్డులో ఇన్‌ఛార్జీ మాత్రమే చేస్తున్నాను. పూర్తిస్థాయిలో సమాచారం కావాలంటే భవనం వద్దకు వెళ్లి తెలుసుకొండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో 35వ వార్డు వెలంపేటలో నిర్మిస్తున్న మరో భారీ భవనానికి సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి శ్వేతని వివరణ కోరగా ఆ భవనానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, ఎటువంటి అదనపు అంతస్తులు నిర్మించలేదని మసిబూసి మారేడుకాయ మాటలతో తప్పించుకుంటున్నారు. ఈమెకు కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని, పైగా ఓ కార్పొరేటర్‌ నిర్మిస్తున్న భవనం కావడంతో తానే దగ్గరుండి అక్రమ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారని సమాచారం.

 

  • టౌన్‌ ప్లానింగ్‌లో అందరికీ సమాన వాటాలు..

జోన్‌-4 పట్టణ ప్రణాళిక విభాగంలో అందరికీ సమాన వాటాలు ఉంటాయని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో ఛైన్‌మాన్‌లు చేసిన పనులను ఇప్పుడు నేరుగా టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జోనల్‌ కార్యాలయంలో ఉండే అధికారులకు ఓ రేటు.. తమకు మరో రేటును ముందస్తుగానే ఒప్పందం చేసుకొని దండీగా దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ విలేకరులు కలుగజేసుకొని ఆరా తీస్తే వాళ్లకు కొంత సొమ్మును కట్టబెట్టి నిర్మాణాలను శెరవేగంగా కట్టుకుంటున్నారు.

 

  • నకిలీ ఇంటి ప్లాన్‌లతో అక్రమ నిర్మాణాలు..

వార్డు స్థాయిలో ఓ అక్రమ నిర్మాణం నిర్మించాలంటే మొదటిగా జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వేయర్‌లు నకిలీ ప్లాన్‌లను తయారు చేసి ఓ కోడిరగ్‌ పద్ధతిలో సంబంధిత టౌన్‌ప్లాన్‌ంగ్‌ అధికారికి అందిస్తున్నారు. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి ఒప్పందం చేసే వరకు పూర్తి బాధ్యత సర్వేయర్‌లే తీసుకుంటారు. ఆ తరువాత ప్లానింగ్‌ సెక్రటరీ ద్వారా మరోమారు దాడి చేసి మరోమారు రూ.లక్షల సొమ్మును రుచి చూస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా ప్లానింగ్‌ కార్యదర్శి మరికొంత సొమ్ము తీసుకొని చూసి చూడనట్టు వార్డులో వ్యవరిస్తారు.

NETRA NEWS
the authorNETRA NEWS

Leave a Reply