NETRA NEWS > Entertainment > ఘనంగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు
– పోలమాంబ అమ్మవారి ఆలయంలో 1001 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు..
– మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్..
– విమ్స్ లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ..
నేత్ర న్యూస్, విశాఖపట్నం: జనసేన కొర్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద వాల్తేర్ కరక చెట్టు పొలమంబ అమ్మవారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి 1001 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఉండాలని వేడుకున్నారు.
ఆదర్శ్ నగర్ హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్టింగ్ చేసి మానసిక వికలాంగుల చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం విమ్స్ హాస్పిటల్ లో రోగుల అందరికీ పండ్లు, రొట్టెలు, పానీయాలు పంపిణీ చేసి జనసైనికులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఏంటో అధికార పార్టీకి చూపిస్తామన్నారు. ఆంధ్రలో ప్రతీ ఒక్కరూ పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అన్నారు. పవన్ అభిమానులు, జన సైనికులకు, ప్రజలు ఒక పండుగలా పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం రాష్టానికి కొత్త నాయకత్వాని ఆహ్వానించండమేనన్నారు. పవన్ జనాదరణకు అధికార, ప్రతిపక్ష పార్టీలు బయపడ్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రంలో పెద్ద ఎత్తున పాల్గున్న పవన్ అభిమానులు, మెగా అభిమానులు పాల్గున్నారు.
NETRA NEWS
the authorNETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
క్యాంప్ రాజకీయాల్లో ఆ పార్టీ నెంబర్ వన్
March 23, 2023
జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు
March 19, 2023
విశాఖలో సందడి చేసిన కథ వెనుక కథ చిత్ర బృందం
March 12, 2023