నేత్రన్యూస్, విశాఖపట్నం: నగరంలో టౌన్ కొత్తరోడ్డు ప్రాంతంలో కొలువైవున్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం రథోత్సవానికి సిద్ధమవుతోంది. జులై 1 నుంచి స్వామి తొలిరథయాత్ర ప్రారంభం రథయ కానుంది. తిరుగురథయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ కార్యనిర్వాహణాధి కారిణి సాదనాల ప్రసన్నలక్ష్మీ, ఓ ప్రకటనలో తెలిపారు.
– జగన్నాథ స్వామివారి ఆలయ చరిత్ర..
నగరంలోని శ్రీజగన్నాథస్వామి దేవాలయానికి 190 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ.1832లో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రాంతంలో గరుడా జగన్నాయకులు వారి కుటుంబీకులు తవ్వకాలు జరిపినప్పుడు ప్రస్తుతం దేవాలయం ఉన్నచోట మహావిష్ణువు రూపుడైన రంగనాథ స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. దీంతో స్వామికి చిన్న తాటాకుల పందిరి వేసి దాంట్లో చలమయ్య దీక్షితులు అర్చకులుగా నియమించారు. ఆ తరువాత గరుడ వంశీయుల ఆరాధ్యదైవమైన జగన్నాథస్వామికి ఆలయం నిర్మించడానికి పూనుకొని క్రీ.శ. 1862లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ నుంచి శ్రీజగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్టించారు. 1864 నుంచి నేటి వరకు రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
– రథం చూడటానికి రారండయ్..!
ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విదియ రోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ప్రారంభిస్తారు. ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయం నుంచి ట్రర్నర్ సత్రం వరకు రథోత్సవం నిర్వహించి, సత్రంలో పదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.
ఆ ప్రాంతంలో స్వామివారు దశావతారాల్లో భక్తులకు
దర్శనమిస్తారు.
– దశావతారాల్లో జగన్నాథ స్వామి..
జులై 1న స్వామివారి తొలి రథయాత్ర
2 – మత్స్యావతారం
3 – కూర్మావతారం
4 వరాహావతారం
5 – నృసింహావతారం
6 వామనావతారం
7 – పరశురామావతారం
8 – రామావతారం
9 – బలరామ, కృష్ణావతారం
10 – శేషపాన్పు అవతారం
11 – తిరుగు రథయాత్ర
– స్వామి దర్శనానికి బస్సు సౌకర్యం..
స్వామివారి రథోత్సవం సందర్భంగా టర్నర్ సత్రం (గుండిచా దేవి ఆలయం)లో ఈనెల 01 నుంచి 11వ తేదీ వరకు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 6, 6సీ, 12, 123, 14, 16, 1729, 20, 20, 25, 258, 256, 2508, 256/65. 253, 36, 48, 48, 526, 52, 528, 525/5, 60, 60సీ, 60హెచ్, 64ఎ, 65ఎఫ్, 66వ, 99, 99ఎ/సీ, 993, 333 నెంబరు గల బస్సులు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయి.
– ఏర్పాట్లు ముమ్మరం చేశాం..
ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా ప్రత్యేక దర్శనం రూ.20, శీఘ్ర దర్శనం రూ.50, విశిష్ఠ దర్శనం రూ.200ల దర్శన లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. గుండిచా దేవి ఆలయం (టర్నర్ సత్రం) వద్ద ఎటువంటి పైరవీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోజువారీ 500నుంచి వెయ్యి మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. – సాదనాల ప్రసన్నలక్ష్మీ (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).